తన గెలుపు కోసం, చంద్రబాబు పై, తెలుగుదేశం పై విమర్శలు చేసిన వారికి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి జగన్ ఏదో ఒక పదవి ఇస్తున్నారు. ఇప్పటికే సాక్షిలో పని చేసే పెద్ద తలకయలకు, పెద్ద పెద్ద పదవులు కట్ట బెట్టారు జగన్. ఇప్పుడు తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ స్వప్నకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌(ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్ గా, ఆమెను నియమించారు. ఆమెతో పాటుగా, సినీ రంగానికి చెందిన శ్రీనివాసరెడ్డిని కూడా ఒక డైరెక్టర్ గా నియమించారు. అయితే సినీ రంగానికి చెందినా శ్రీనివాసరెడ్డి అనగానే, అందరూ కమెడియన్ / యాకర్ట్ శ్రీనివాసరెడ్డి అని అనుకున్నారు. ప్రముఖ పత్రికలు కూడా ఆయన బొమ్మతో సహా, వేసాయి. అయితే దీని పై శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఆ శ్రీనివాసరెడ్డి నేను కాదు, నన్ను వదిలేయండి, "ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారు" ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియమించబడ్డారు, అంటూ పోస్ట్ చేసారు.

swapna 13102019 2

అందరూ కమెడియన్ శ్రీనివాసరెడ్డికి విషెస్ చెప్తూ ఉండటంతో, ఆయన స్పందించి, ఆ శ్రీనివాసరెడ్డి నేను కాదు, నన్ను వదిలేయండి అని చెప్పుకొచ్చారు. ఇక యాంకర్ స్వప్న విషయానికి వస్తే, మోదట్లో దూరదర్శన్ ఆ పై టీవీ9లో యాంకర్‌గా, తర్వాత సాక్షి ఛానెల్‌లో యాంకర్ గా, ఆమె తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సాక్షిలో పని చేస్తున్నప్పుడు, చంద్రబాబు పై, టిడిపి పై వ్యతిరేక కధనాలు వెయ్యటంలో, ఆమె కూడా ఒక చెయ్యి వేసారు. ఆ తర్వతా సాక్షి నుంచి బయటకు వచ్చినా, ఆ ఛానెల్‌కు కన్సల్టెంట్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తుంది స్వప్న. అంతేకాదుతనకు ఉన్న,వెబ్‌ చానెల్‌ ద్వారా, కధనాలతో జగన్ పట్ల ఉడతా భక్తి చాటుకుంటూనే ఉంది.

swapna 13102019 3

ఇక స్వప్న తాను చేసే ఇంటర్వ్యూలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాని ఇరుకున పెడుతూ, జగన్ కు బాగా పుష్ ఇచ్చే విధంగా ఆమె ఇంటర్వ్యూస్ ఉండేవి. జగన్ అధికారంలోకి రావటానికి, ఆమె కూడా ఒక చెయ్య వేసారు. ఇప్పుడు జగన్ రుణం తీర్చుకుంటున్నారు. అయితే ఏ పార్టీ పదవో ఇచ్చుకోవాలి కాని, ఇలా ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ముతో, వారికి పదవులు, జీతాలు ఇవ్వటం ఏంటో మరి. ఇక మరో పక్క స్వప్నను ఎస్వీబీసీ డైరెక్టర్ గా నియామకం చేయటం వెనుక ఒక స్కెచ్ కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే చైర్మెన్ గా ఉన్న పృథ్వి రాజ్ బాలిరెడ్డి దూకుడుకి చెక్ పెట్టే ఉద్దేశంతోనే, స్వప్నను డైరెక్టర్ చేసారని, ఇక పృథ్వి ఇష్టం వచ్చినట్టు చెయ్యటం కుదరదని, అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి తనకి కావల్సిన వారందరికీ, ప్రభుత్వ పదవులు, వారికి జీతాలుగా ప్రజల సొమ్ముని, జగన్ కట్టబెట్టెస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read