కుప్పంలో పాద‌యాత్ర‌లో పాల్గొని మాసివ్ హార్ట్ స్ట్రోక్ తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన నంద‌మూరి తార‌క‌ర‌త్న  చ‌నిపోతాడ‌ని విష‌ప్ర‌చారం చేసుకునేందుకు చాలా కంటెంట్ రెడీ చేసుకుంది వైసీపీ పేటీఎం బ్యాచ్‌. కందుకూరు, గుంటూరు తొక్కిస‌లాట‌ల ఖాతాల్లోకి తారకరత్న మ‌ర‌ణాన్ని చేర్చేసి చంద్రబాబు మీదకు తోసేయాలని నిన్నటి నుంచి కాచుకుని కూర్చుందిపేటీయం బ్యాచ్, బులుగు మీడియా. తార‌క‌ర‌త్న‌కి జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగి ఉంటే..దానిని సాకుగా చూపించి నారా లోకేష్ పాద‌యాత్ర ఆపేందుకు కూడా వైసీపీ పెద్ద‌లు వ్యూహం ప‌న్నారు. కుప్పం  ఆస్ప‌త్రి నుంచి బెంగళూరు నారాయ‌ణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. గోతికాడ గుంట‌న‌క్క‌ల్లా తార‌క‌ర‌త్న మ‌ర‌ణ‌వార్త కోసం నిరీక్షించిన పేటీఎం పెయిడ్ బ్యాచులు కొంద‌రు ముందే ఆ ఫేక్ కంటెంట్ ని వ‌దిలేశారు. బులుగు మీడియా వాడి ఓ చాన‌ల్‌ వాడైతే తార‌క‌ర‌త్న తొక్కిస‌లాట‌లో చ‌నిపోయాడ‌ని మెటీరియ‌ల్ సిద్ధం చేసుకున్నాడు. పేటీఎం వెబ్ సైట్లు తార‌క‌ర‌త్న‌పై విష‌ప్ర‌యోగం జ‌రిగింద‌ని పోస్టులు పెట్టేశారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే వైసీపీ సోష‌ల్మీడియాకి  అన్నీ తానై చూసుకునే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి తార‌క‌ర‌త్న అల్లుడు అవుతాడు. సాయిరెడ్డి మ‌ర‌ద‌లి కూతురు అలేఖ్య‌రెడ్డినే తార‌క‌ర‌త్న భార్య‌. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్మీడియాలో తార‌క‌ర‌త్నపై కుట్ర జ‌రిగి ఉండొచ్చ‌ని, ఏవి ప‌డితే ఆ పోస్టులు పెట్టొద్దంటూ న‌ర్మ‌గ‌ర్భంగా హెచ్చ‌రించాడు ఓ వైసీపీ సోషల్ మీడియాలో ఉండే ప్రముఖుడు. చివరకు వైసీపీ మంత్రులు కూడా తారకరత్న హార్ట్ స్ట్రోక్ ని, లోకేష్ కి ముడి పెట్టి ప్రచారం చేస్తున్నారు.మొత్తానికి ఇలా తయారయ్యింది రాజకీయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read