టీవీ5 వ్యవహరంలో, విజయసాయి రెడ్డి కక్ష పూరితంగా, కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటూ, తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లోనే... "వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పనికొచ్చే ఏ పనీ చేయకపోయినా.. పనికిమాలిన పనులు మాత్రం చాలా చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని ఎంపీల బృందాన్ని వెనకేసుకుని ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వైసీపీ ఎంపీలను ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా.. జగన్ రెడ్డిపై ఉన్న కేసుల నుండి తప్పించడానికి వాడుతున్నారు. సొంత వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేకుండా పోయింది. అనేక కేసుల్లో ఏ-2గా ఉండి బెయిలుపై తిరుగుతున్న జైలు పక్షి.. మనీలాండరింగ్ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాశారు. అది కూడా వాట్సాప్ మెసేజీల ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందంటూ చర్యలు తీసుకోవాలన్నారు. లేనిదాన్ని ఉన్నట్లు అభూతకల్పనలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు సృష్టించడంలో వైసీపీ నేతలు, జగన్ రెడ్డి కింద పని చేస్తున్న అధికారులు ఆరితేరిపోయారు. ఇప్పుడు.. రఘురామరాజు,బి.ఆర్.నాయుడు మధ్య జరగని సంభాషణను జరిగినట్లు ఫేక్ ప్రచారానికి తెరలేపారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకునే గతంలో సుప్రీంకోర్టు కొన్ని తీర్పులిచ్చింది. 14.07.2021 నాడు A to Z ఇన్ఫ్రా సర్వీసెస్ వర్సెస్ క్రిప్టో ఇన్ఫ్రా స్ట్రక్చర్ కేసులో వాట్సప్ సందేశాలను చట్టపరమైన ఆధారాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయొచ్చు, అవసరమైతే డిలీట్ చేయవచ్చు. అలాంటి వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫోర్జరీల్లో పీహెచ్డీ చేసిన 420 విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు పట్టించుకునేదెవరు.? ఎంపీ రఘురామరాజు, బి.ఆర్.నాయుడు మధ్య మనీలాండరింగ్ జరిగిందంటూ కేంద్రానికి ఇచ్చిన లేఖలో.. అవినీతి కేసుల్లో తేలుతున్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి కూడా సంతకాలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. దొంగే దొంగ అని అరిచినట్లు.. నిన్నటికి నిన్న అయోధ్యరామిరెడ్డి కంపెనీల్లో ఐటీ శాఖ నిర్వహించిన తనిఖీల్లో రూ.1200 కోట్ల కృత్రిమ నష్టాలు చూపినట్లు తేలింది. రూ.300 కోట్ల లెక్కల్లో లేని నగదు దొరికింది. వందల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన దొంగను వెంటబెట్టుకుని, మరో దొంగ కేంద్ర మంత్రులకు లేఖలిచ్చేందుకు విజయసాయిరెడ్డి సిగ్గుపడాలి. ప్రభుత్వ అవినీతిని, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే కక్షతో లేనిపోని పత్రాలు సృష్టించి మీడియాపై నిందలు వేస్తున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం ఎన్నిసార్లు దాడులు చేసినా టీవీ 5 నిజాలు ప్రజలకు చేరవేయడమే నేరమా.? అదిరించినా, బెదిరించినా తగ్గని ఛానళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లేని పోని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతరులపై నిందలు మోపే ముందు విజయసాయి రెడ్డి తనపై ఉన్న మనీలాండరింగ్ కేసుల గురించి మాట్లాడాలి. మారిషస్ కోర్టులో మీపై విచారణ జరిగిన మాట వాస్తవం కాదా.?

అంతర్జాతీయ స్థాయిలో మీ అవినీతి గురించి ప్రస్తావించడం వాస్తవం కాదా.? మీ అవినీతి కారణంగా అంతర్జాతీయ కోర్టులో దేశ ప్రధానిపై కేసు నమోదు చేయడం నిజం కాదా.? క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన మీడియా ద్వారా ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ మీ ఫిర్యాదు లేఖలు చూసి నవ్వుకుంటున్నారు. వాట్సాప్ మెసేజీల గురించి మాట్లాడుతున్న వైసీపీ ఎంపీలు జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసుల గురించి, మనీ లాండరింగ్ కేసుల గురించి మాట్లాడాలి. అంతటి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ నేతలు ఇచ్చే ఫిర్యాదు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నందు వలనే, ఆయా మీడియా సంస్థలపై దా-డు-ల-కు పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా టీవీ-5 యాజమాన్యానికి నోటీసులిచ్చారు. అయినా బెదరకుండా ప్రభుత్వ దుర్మార్గాలను బయటపెడుతున్నందుకే తప్పుడు పత్రాలు సృష్టించి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో శునకానందం పొందడం, అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పకోడీ పేపర్ లో తప్పుడు రాతలతో నింపుకున్నా.. అదిరేవారు బెదిరే వారు ఎవరూ లేరని ఏ-2 గుర్తెరగాలి. 2430 వంటి జీవోలు తెచ్చినా, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టినా మీ అవినీతిని బయట పెడుతూనే ఉంటారు. అవినీతి కుంభకోణాలు బయటపెడుతుతూ.. ప్రజా పక్షాన నిలుస్తున్న మీడియా సంస్థలపై ప్రత్యక్ష దా-డు-ల-కు పాల్పుడుతున్నారు. తప్పు చేశామనే భావన ఉంటే ఎవరూ పోరాటానికి ముందుకు రారు. బి.ఆర్.నాయుడు ఏ చిన్న తప్పూ చేయలేదు కాబట్టే.. రెండేళ్లుగా పోరాడి నిలబడ్డారు. విజయసాయిరెడ్డీ.. నీకు సిగ్గుంటే ముందు తనపై ఉన్న మనీలాండరింగ్ కేసుల నుండి బయటపడాలి. ఇన్ని 420 కేసులు పెట్టుకుని ఇతరుల గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి. అవినీతి బురదలో దొర్లుతూ.. దాన్ని ఇతరులకు అంటించాలనుకోవడం సిగ్గుచేటు. మీ తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు ఆరోపణలకు త్వరలోనే కోర్టుల్లో మొట్టికాయలు పడడం తప్పదని గుర్తుంచుకోండి."

Advertisements

Advertisements

Latest Articles

Most Read