శాసనమండలిలో నిన్న అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు, వైసీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రారంభం కాగానే, మండలి చైర్మెన్ ఈ రెండు బిల్లుల పై అనౌన్స్ చేసారు. అయితే దాని కంటే, ముందుగానే, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, లెగిసి, రూల్ 71 కింద నోటీసు ఇచ్చి, చర్చకు పట్టు పట్టారు. ఆ నోటీస్ మీద ఓటింగ్ జరగాలి అని పట్టు పట్టారు. దీంతో మండలి స్పీకర్ షరీఫ్ ఆ నోటీస్ కు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరూ అంటూ, అడగటంతో, తెలుగుదేశం సభ్యులు అందరూ నోటీస్ కి అనుకూలంగా చెప్పటం, 20 మంది కంటే, ఎక్కువ సభ్యులు ఒప్పుకోవటంతో, ఈ నోటీస్ స్వీకరిస్తున్నామని మండలి చైర్మెన్ చెప్పారు. అయితే ముందుగా బిల్లులు ప్రవేశ పెట్టాలని, తరువాత ఏదైనా అని మంత్రి బుగ్గన పట్టు పట్టారు. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసు పై చర్చ జరపవద్దు అంటూ ప్రభుత్వం తరుపున కోరారు. అయితే, ఈ సందర్భంలో, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మంత్రి బుగ్గన మధ్య వాదనలు జరిగాయి.

council 21012020 2

అయితే, బిల్లులు ప్రవేశపెట్టటానికి అవకాశం లేదు, నోటీస్ మీద చర్చ జరగాలి అని యనమల పట్టు బట్టారు. అయితే, ఈ సందర్భంలో, బొత్సా స్పందిస్తూ, యనమల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో, గందరగోళం నెలకొంది. అయితే ఇదే సందర్భంలో, మండలి పై బొత్సా చేసిన వ్యాఖ్యలు యనమల సభ దృష్టికి తీసుకు వచ్చారు. శాసన మండలిలో బిల్ పాస్ కాక పొతే, శాసనమండలి బయట, లోపల ఏమి జరుగుతుందో చూస్తారు అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యలు, సభ గౌరవాన్ని కించ పరిచేలా ఉన్నాయని, బొత్సా పై చర్యలు తీసుకువాలని కోరటంతో, ఇరు వర్గాలు వాదనలకు దిగాయి. బొత్సా క్షమాపణ చెప్పి, బిల్లులు ప్రవేశ పెట్టాలని కోరారు. అయితే, ఇదే విషయం పై, సభలో చర్చ జరుగుతుంది.

council 21012020 3

ముందుగా, ఏది చెప్పట్టాలి అనే విషయం పై, చైర్మెన్ కూడా, చర్చలు జరుపుతున్నారు. అయితే తెలుగుదేశం వ్యూహంతో ఖంగుతిన్న ప్రభుత్వం, వెంటనే లైవ్ ప్రసారాలు నిలిపివేసింది. అయితే లైవ్ ప్రసారాలు నిలిచి పోవటానికి, సాంకేతిక కారణాలు సాకుగా, అధికారులు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం, ఈ చర్యను తప్పు పడుతున్నాయి. లైవ్ ప్రసారాలు ఆపేసి, లోపలా ఏమి జరుగుతుందో తెలియకుండా, ప్రభుత్వం , ప్రతిపక్షాలు ఏమి చెప్తున్నారో ప్రజలు చూడకుండా చెయ్యటం అన్యాయం అని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా, ఇప్పటి వరకు , 11 గంటల వరకు అయితే, శాసన మండలి లైవ్ ఇవ్వలేదు. విభజన నాటి సమయంలో, ఆ నాటి ప్రభుత్వం కూడా, పార్లమెంట్ లో ఇలాగే చేసిందని, గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read