ప్రభుత్వాన్ని ప్రశ్నించి వార్తల్లో నిలిచిన వెంకాయమ్మ పై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబ సభ్యుల పై వైసీపీ శ్రేణులు దా-డి చేసాయి. వెంకాయమ్మను ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే కొట్టారు. అయితే వెంకాయమ్మ పై పోలీస్ స్టేషన్ లోనే దా-డి చేయటం, అలాగే కొడుకు పైన దా-డి చేయటం తేలినా, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు తాడికొండ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. అయితే అనూహ్యంగా అక్కడకు వచ్చిన వైసీపీ శ్రేణులు, టిడిపి నేతల పై కూడా దౌర్జన్యానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగటంతో, పోలీసులు ఇద్దరినీ సముదాయించారు. బాధ్యుల పై కేసులు పెడతాం అని ఎస్పీ హామీ ఇవ్వటంతో, టిడిపి నేతలు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన పై తెలుగుదేశం సీరియస్ అయ్యింది. ఈ రోజు చలో కంతేరుకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దళిత సంఘాలు నేతలతో కలిసి, ఈ రోజు కంతేరు వెళ్లి, వెంకాయమ్మని పరామర్శించనున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా టిడిపి పై అటాక్ కూడా ప్లాన్ చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read