ఈ రోజు మంత్రి బొత్సా మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో 30 వేల మందికి ఇళ్ళ స్థాలాలు ఇవ్వాల్సి ఉండగా, చంద్రబాబు కోర్టుకు వెళ్లి మొత్తం ఆపేశారు అంటూ, ఎప్పటి లాగే విరుచుకు పడ్డారు. ఈ విషయంలో రకరకాల ఆరోపణలు చేసారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో కౌంటర్ ఇచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీకి , ఈ కేసులకు ఏమి సంబంధం అని ప్రశ్నించింది. మొత్తం 38 వేల ఎకరాలు ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించినా, ఒక 2 వేల ఎకరాలు విషయంలో మాత్రమే ప్రైవేటు పార్టీలు, కోర్టులో కేసులు వేశాయని, ఆ కేసులు వేసిన వారిలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారని, వారి పేర్లు విడుదల చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వెళ్లి, ఆ 2 వేల ఎకరాలు వదిలేసి, మిగతా 36 వేల ఎకరాలు పంచాలని, మేము చెప్తున్నాం కదా, మీరు పంచండి అంటూ, వైసీపీకి కౌంటర్ ఇవ్వటంతో, వైసిపీ అవాక్కయింది. నిజానికి అందరి మనసులో ఉంది ఇదే. కోర్టు ఏమి 30 వేల మందికి ఇవ్వవద్దు అని చెప్పలేదు కదా, కేవలం వివాదం ఎక్కడ ఉందొ అక్కడ మాత్రమే ఆగమని చెప్పింది, అవి కాకుండా మిగతావి ఇచ్చేస్తే, దాదాపుగా 95 శాతం మందికి ఇచ్చేయవచ్చు కదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీని పై టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. "అమరావతిపై నోటికొచ్చిన అబద్ధాలాడి ప్రజాక్షేత్రంలో అభాసుపాలైన అబద్ధాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేటికీ తీరు మార్చుకోక మరో అబద్ధమాడుతున్నారు. సెంటు పట్టా పంపిణీ పేరుతో ఇప్పటికే వైసీపీ నేతలు రూ. 4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు."

"అవినీతిని కొనసాగించేందుకు ఇళ్ల పట్టాల పంపిణీని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. తమ కుట్రను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారు. అనపర్తిలో మాజీ జడ్పీటీసీ కత్తి భగవాన్ రెడ్డి పట్టాల పంపిణీపై కేసు వేసింది వాస్తవం కాదా..? మొత్తం 38 వేల ఎకరాలలో కోర్టు కేసుల కారణంగా పంపిణీ ఆగిపోయింది 2వేల ఎకరాలు మాత్రమే. మిగిలిన 36వేల ఎకరాలు పంచకుండా ఆపడం వెనుక అధికార పార్ట నేతల అవినీతి కొనసాగింపు కోసం కాదా..? టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తైన 2,62,216 టిడ్కో ఇళ్లను డిపాజిట్ దారులైన లబ్ధిదారులకు 17 నెలలైనా ఎందుకు ఇవ్వలేదు..? 50శాతానికి పైగా పనులు పూర్తైన 4,96,572 ఇళ్లకు సంబంధించి మిగిలిన పనులు పూర్తిచేసి లబ్దిదారులకు అందించకపోవడం పేదలకు ద్రోహం చేయడం కాదా..? వైసీపీ నేతల దుర్మార్గపూరిత విధానాల కారణంగా లబ్దిదారులు ఒకవైపు అద్దెలు కట్టుకుంటూ, మరోవైపు వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు 10 లక్షల ఇళ్లను నిర్మించడం జరిగింది. దీంతో పాటు 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన 4,40,426 ఇళ్లకు అదనంగా రూ.25 నుంచి 50 వేల దాకా ఆర్థిక సాయం అందించి పేదలకు పక్కా ఇళ్లు అందించాం. మరలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ పాటికి మరో 10 లక్షల మందికి ఇళ్లు అందేవి. కానీ పేదలకు ఉచితంగా ఇళ్లు అందజేస్తామని, కట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. 17 నెలల్లో ఒక్క ఇంటినీ నిర్మించకపోగా తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన తాళాలను సైతం వెనక్కు లాక్కున్నారు. ఇది దుర్మార్గం కాదా..? సంక్రాంతి లోపు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అప్పగించకుంటే.. ఇళ్లను స్వాధీనం చేసుకునే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. " అని కాలువ శ్రీనివాసులు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read