నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలఫలితాల్లో 6-20నిమిషాల సమయానికి టీడీపీ మద్ధతుదారులు విజయం సాధించినవి 24 గ్రామాలైతే, వైసీపీవారు గెలిచినవి కేవలం పదిగ్రామాలేనని, ఉదయం నుంచి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన కందులవారి పల్లె పంచాయతీపై మీడియామొత్తం టెన్షన్ వాతావరణాన్ని సృష్టించిందని, ఆగ్రామంలో టీడీపీ మద్ధతుదారు 563ఓట్లతో విజయం సాధించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సాయంత్రం 6, 7,8 గంటలవరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మద్ధ తుదారులే విజయం సాధిస్తుంటారని, మెజారిటీస్థానాలు టీడీపీకే వస్తాయని, తరువాత చిన్నచిన్నగా వైసీపీవారి చీకటిరాజ్యం మొద లవుతుందన్నారు. టీడీపీ విజయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తు న్నామని, ఈ విధంగా మొదటివిడతనుంచీ చెబుతున్నామన్నారు. అదేవిధంగా వైసీపీవారు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. తాము 6గంటలకు గెలుపొందిన 24 పంచాయతీల వివరాలను నియోజకవర్గాలవారీగా వెల్లడిస్తు న్నామని, అదేమాదిరి వైసీపీమద్ధతుదారులు గెలిచిన గ్రామాలను ఆపార్టీవారు ఎందుకు బహిర్గతంచేయడం లేదన్నారు. చీకటి పడే కొద్దీ వైసీపీనేతలు, ఆపార్టీకి చెందిన గూండాలు, రౌడీలు, పోలీసులు కౌంటింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఫలితాలు తారుమారు చేస్తున్నారు. అర్థరాత్రి అయ్యేసరికి పూర్తిగా ఫలితాలన్నీ వైసీపీ పరమే అవుతున్నాయని, గడచిన మూడుదశల్లో వెలువడిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు.

పోలీసులు, వైసీపీనేతలు, ఆపార్టీ రౌడీలు ఎంతలా బెదిరింపులకుపాల్పడినా, టీడీపీకార్యకర్త లు, గ్రామనాయకులు మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి పంచా యతీ ఎన్నికల్లో పోరాడారు. అటువంటి వారందరికీ పేరుపేరునా టీడీపీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా మని ఆనంద్ బాబు తెలిపారు. సాయంత్రం 6గంటలకే వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలకు సిద్ధమయ్యారని, ఫలితాలసరళి వారికి అనుకూలంగా లేకపోయినా, అత్యుత్సాహం చూపుతున్నా రన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరమంత్రులు సంబరాలకు సిధ్ద మవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 6 గంటల కు వెలువడిన ఫలితాల్లో టీడీపీకి 24స్థానాలు వస్తే, విజయోత్సవ కార్యక్రమాలు ఎలాచేస్తారని మాజీమంత్రి నిలదీశారు. అధికార దర్పంతో, కౌంటింగ్ ప్రక్రియలో ఉన్న అధికారులను, సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురిచేయడానికే విజయోత్సవాల పేరుతో పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. సాయంత్రం 6 తరువాత నుంచి రాబోయే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తా యనే అభిప్రాయంలో వైసీపీ వారు ఎలా ఉంటున్నారన్నారు. ముం దుగాను సంబరాలకు పిలుపునిచ్చి, కౌంటింగ్ ప్రక్రియను తారుమా రుచేయడమే లక్ష్యంగా అధికారపార్టీ వ్యవహరిస్తోందన్నారు. నైతికం గా ఓడిపోయిన వైసీపీ, ప్రజలదృష్టి మళ్లించడానికే విజయోత్సవ సంబరాలకు పిలుపునిస్తోందన్నారు. తొలివిడత నుంచీ రాజ్యాంగా న్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసేలా వైసీపీ ఎన్నికలప్రక్రియను నిర్వహిస్తోందని మాజీమంత్రి మండిపడ్డా రు. గ్రామాల్లో ఎన్నిరకాలుగా చేయాల్సిన దారుణాలు చేసినా, భయోత్పాతం సృష్టించినా, ప్రజలను భయపెట్టి, వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించి, గ్రామాల్లో కలుషితవాతావరణం తీసుకొచ్చినా టీడీపీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారన్నారు. ఇదేవిధంగా రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సి పల్ ఎన్నికల్లో కూడా తమపార్టీ నేతలు, కార్యకర్తులు పనిచేస్తారని ఆనందబాబు తేల్చిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read