రైతు గెలవాలి – వ్యవసాయం కలకాలం నిలవాలనే కాన్సెప్ట్ తో టీడీపీ రైతుకోసం – తెలుగుదేశం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, రైతన్నలు విత్తనం నాటే దగ్గర్నుంచి, పంట ఉత్పత్తుల విక్రయం వరకు అడుగడుగునా జగన్ ప్రభుత్వం నిలువునా దగాచేస్తూ, అన్నదాతలకు ఉరిబిగించే చర్యలకే పాల్పడుతోందని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయమంటేనే రైతులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వ ఎక్కడా ఒక్క రైతుకికూడా కనీసం నాగలిబోల్టు కూడా ఇవ్వలేదని మర్రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు పొలాల్లో మోటార్లు వేసుకొని పంటలకు నీరందించాలంటే, కనీసం రూ.2లక్షలవరకు ఖర్చువుతోందని, పొలాలకు నీరు పెట్టినాకూడా ఎక్కడికక్కడ ఆ నీరంతా మొక్కలకు సరిగా అందకుండానే ఇంకిపోతోందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి టీడీపీ ప్రభుత్వంలో ఎక్కువ భూమిని సాగులోకి తేవడానికి, 2017-18లో రూ.1200కోట్లు, 2018-19లో రూ.1000కోట్లను మైక్రోఇరిగేషన్ కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. మైక్రో ఇరిగేషన్ పద్ధతిని వ్యవసాయంలో ప్రవేశపెట్టడంద్వారా గతంలో మోటార్ల ద్వారా ఎకరాకు అందేనీటిని, డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతిలో 5ఎకరాలకు అందేలాచేసి, రైతులకు ఖర్చులు కూడా తగ్గించడం జరిగిందన్నారు. కరెంట్ కోసం రైతులు ఎదురుచూడటం, అదివచ్చి, పోయినప్పుడల్లా రైతులు పొలానికి పరిగెత్తే పని లేకుండా చేసిన ఘనత టీడీపీప్రభుత్వానిదేనన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద, రైతులకు ఉచితంగా బోర్లు వేయించి, మోటార్లను కూడా టీడీపీప్రభుత్వం బిగించ డం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదే పథకానికి వై.ఎస్.ఆర్ జలకళ అనిపేరుమార్చాడు తప్ప, ఎక్కడా ఒక్క బోరు కూడా వేయించిందిలేదన్నారు. బాధ్యతలేని ప్రభుత్వం, బాధ్యతలేని మంత్రుల ఏలుబడిలో అధికారులుకూడా బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవని, తెరుచుకకుంటే, మూతపడటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే వానలే వానలని వైసీపీవారు ఊదరగొట్టారని, కానీ ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి పాలనలో గత సంవత్సరం రబీలో ఎక్కడా కాలువల్లో నీళ్లు పారిందిలేదన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమవ్వబట్టే, రైతులకు సకాలంలో నీరందించలేక పోయిందన్నారు.

రైతులకు ప్రభుత్వమే సమాధానంచెప్పలేకపోతే, రైతుభరోసా కేంద్రాల్లోని సిబ్బందేం చెబుతారన్నారు? రైతుల తరుపున బీమా కంపెనీలకు ప్రభుత్వం సకాలంలో పంటలబీమా సొమ్మ కట్టకపోవడంతో, పంటలు నష్టపోయిన రైతులు ఈ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమంత్రి రైతులకు న్యాయంచేస్తున్నాడో, అన్యాయం చేస్తున్నాడో ప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు కొబ్బరిచెట్టుకు రూ.1500లు, జీడితోటలకు హెక్టారుకి రూ.30వేలు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అందిస్తే, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రైతుల వద్దకు వెళ్లిన జగన్ రెడ్డి, జీడితోటలకు అదనంగా రూ.30వేలు ఇస్తానని, కొబ్బరిచెట్లకు అదనంగా రూ.1500లు ఇస్తానని చెప్పాడని, కానీ ఇంతవరకు ఆసాయం మాత్రం అందలేదన్నారు. జామాయిల్, సుబాబుల్ క్వింటాను రూ.5వేలకు తగ్గకుండా అమ్మేలా చూస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చాడని, కానీ నేడు క్వింటా రూ.1000కి కూడా కొనేవారు లేకుండా పోయారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొన్నిప్రాంతాల్లో రైతులు ఉచితంగానే జామాయిల్ , సుబాబుల్ ను తీసుకెళ్లమని వ్యాపా రులకు చెబుతున్నారన్నారు. ఆఖరికి ఇన్ పుట్ సబ్సీడీ లో కూడా జగన్ ప్రభుత్వం రైతులను మోసగించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వరిపైరుకి హెక్టారుకి రూ.20వేల పరిహారం ఇస్తే, జగన్ దాన్ని రూ.15వేలకు తగ్గించాడన్నారు. రూ.15వేలు ఇవ్వడానికి కూడా వ్యవసాయమంత్రి ఒకటే గగ్గోలుపెట్టాడన్నారు. ఈ విధంగా అడుగడుగునా రైతులకు ఉరివేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగానే తాము 14వతేదీ నుంచి 18వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుకోసం-తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు . వ్యవసాయరంగ పరిరక్షణకోసం, అన్నదాతలకు అండగా ఉండి, వారికి ప్రభుత్వంనుంచి తగిన తోడ్పాటు లభించేవరకు తమపోరాటం సాగుతుం దన్నారు. రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని జోన్లవారీగా నిర్వహిస్తున్నామన్న శ్రీనివాసరెడ్డి, 14 వతేదీన నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, కడప పార్లమెంట్ నియోజకవర్గాల జోన్లలో, 15వ తేదీన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 16వతేదీన ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 17వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు నియోజకవర్గాల్లో, 18వ తేదీన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు సహా, మండల,గ్రామస్థాయి నేతలు విధిగా పాల్గొనాలని, రైతులనుకూడా పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని మర్రెడ్డి పిలుపు నిచ్చారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read