తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై గత రెండు రోజులుగా, సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు, అలాగే గతంలో ఉండవల్లి శ్రీదేవికి సన్నిహితంగా ఉండే ఇద్దరు, రెండు రోజుల్లు క్రితం, ఎమ్మెల్యే శ్రీదేవి అలాగే ఎంపీ సురేష్ పై ప్రెస్ మీట్ పెట్టి, అవినీతి చేస్తున్నారు అంటూ కొన్ని ఆధారాలు బయట పెట్టారు. అలాగే తమను వాడుకుని వదిలేసారని, డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడేమో తమ పై కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ, ప్రెస్ మీట్ లో వాపోయారు. అయితే దీని పై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి వారు తన పై అనవసరంగా అల్లరి చేస్తున్నారని, వారి వళ్ల తన ప్రా-ణా-ని-కి కూడా ముప్పు ఉందని, వారి పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే నిన్నటి వరకు ఈ వ్యవహరం ఇలా ఉండగా, ఈ రోజు మరో మలుపు తిరిగింది. సందీప్ అనే వ్యక్తి ఒక సేల్ఫీ వీడియో విడుదల చేసి, జరిగినది మొత్తం జగన్ కు విన్నవించుకుంటూ తమను కాపాడాలని కోరారు. సేల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకున్నారు. ఈ వీడియో అన్ని టీవీ చానల్స్ లో వచ్చింది. అయితే మరి కొద్ది సేపటికి గతంలో ఉండవల్లి శ్రీదేవితో ఆటను మాట్లాడిన ఆడియో విడుదల చేసి, మరో సేల్ఫీ వీడియో విడుదల చేసారు. తన పై అనవసరంగా శ్రీదేవి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, ఆమె పెకాటి ఆదిద్దాం అంటూ చెప్పింది అంటూ, ఒక ఆడియో విడుదల చేసారు. అయితే ఇది ఫేక్ అని ఉండవల్లి శ్రీదేవి ఒక టీవీ ఛానల్ లో చెప్పారు.

undaalli 07112020 2

ఇక మరో పక్క ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత స్పందించారు. ఉండవల్లి శ్రీదేవి పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని డిమాండ్ చేసారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు వ్యవహారం మర్చిపోక ముందే ఇప్పుడు సొంత పార్టీ నేతలే, ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయట పెట్టారని ఆరోపించారు. ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నాయని, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హులు కాదని, మీడియాలో వస్తున్న ఆడియో టేప్ లో పై విచారణ చేపించి, ఆమెను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు. స్వయంగా ఎమ్మెల్యేనే పేకాట నిర్వహించాలని చెప్తుంటే, ముఖ్యమంత్రి ఈ విషయం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ప్రజలు వీరికి సమస్యలు తీర్చటం కోసం ఎమ్మెల్యేలను చేస్తే, వీళ్ళు అవేమీ పట్టించుకోకుండా పేకాటలో బిజీగా ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం, పోలీసులు ఈ అంశం పై సీరియస్ గా దృష్టి పెట్టాలని, చట్ట ప్రకారం వ్యవహరించి, ఉండవల్లి శ్రీదేవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read