తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని వైపుల నుంచి ఎలాంటి ఒత్తిడి పెట్టాలో, అలాంటి ఒత్తిడి పెడుతూ, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది. ప్రజల సంగతి ఏమో కాని, ప్రతిపక్షాల వేధింపులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేస్తున్నారని, వారిని వేదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది. మానసికంగా వేధిస్తూ, ప్రతిపక్ష పాత్ర చెయ్యనివ్వకుండా, ప్రజల్లో తిరగానివ్వకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు, మాజీ మంత్రులకు భద్రత తగ్గించిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా భద్రతను పూర్తిగా తొలగిస్తూ, సంచలన నిర్ణయం తీసుకోవటం చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తున్న టిడిపి నేతలు, రాజశేఖర్ రెడ్డి టైములో, పరిటాల రవికి ఇలాగే చేసి, చంపేసిన ఉదంతాన్ని చూసి భయపడుతున్నారు.

తాజగా జగన్ ప్రభుత్వం, చాలా మంది తెలుగుదేశం సీనియర్లకు, ముఖ్య నాయకులకు భద్రత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రిందట, నారా లోకేష్ భద్రతను కుదించిన విషయం తెలిసిందే. నక్సల్స్ హిట్ లిస్టు లో ఉన్న లోకేష్, తొందర్లోనే సెలెక్ట్ కమిటీ విషయమై, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే, నారా లోకేష్ స్వేచ్చగా గ్రామాల్లోకి, వివిధ ప్రాంతాలకు వెళ్ళకుండా, భద్రత తొలగించారని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే మూడు రోజుల క్రితం, తెలుగుదేశం సీనియర్ నేతలు అయిన, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిల భద్రతను తొలగించింది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలగించటం ఆశ్చర్యకర విషయమే.

ఎందుకంటే, అది ఫాక్షన్ ఏరియా కావటం, జేసీ కూడా దూకుడుగా ఉండే మనిషి కావటంతో, జేసీని ఆత్మరక్షణలో పడేసి, మానసికంగా ఇబ్బంది పెట్టే చర్యగా దీన్ని భావించ వచ్చు. అయితే ఇప్పుడు తాజగా, కృష్ణా జిల్లాలో సీనియర్ మంత్రి అయిన, దేవినేని ఉమాకు భద్రత తొలగించారు. ఉమా చురుగ్గా అమరావతి ఉద్యమంలో పాల్గుంటున్న సంగతి తెలిసిందే. ఇక మరో సంచలన విషయం ఏమిటి అంటే, పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి కూడా భద్రత తొలగించటం. ఈ రోజు వీరి ఇద్దరి రక్షణ తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంతే కాకుండా, వెంటనే వెనక్కు రావాలని, ఇవాళ మధ్యాహ్నంలోపు గన్‌మెన్‌లందరూ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని, ప్రభుత్వం ఆదేశించటం కొసమెరుపు. ఇప్పటికే చంద్రబాబుకి కూడా భద్రత తగ్గించగా, ఆయన హైకోర్ట్ కు వెళ్లి, మళ్ళీ సెక్యూరిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read