తిరుపతి కృష్ణాపురం సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సభలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దా-డి చేశారు. ఈ దా-డి-లో ఇద్దరు కార్యకర్తలు గాయపడార్డు. ప్రచార రథం, మీడియా వాహనం కొద్ది పాటి దెబ్బతిన్నాయి. దీనిపై తెలుగుదేశం నాయకులు అర్బన్ పోలీస్ జిల్లా అదనపు ఎస్పీ సుప్రజాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇంతటితో ఈ విషయాన్ని ఆపటం లేదు. దీని పై ఉన్నత స్థాయిలో చర్చ చేసేందుకు టిడిపి సిద్ధం అయ్యింది. ముఖ్యంగా జెడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న చంద్రబాబు పై ఇలాంటి ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి, ఇక్కడ పోలీసులు, యంత్రాంగం మొత్తం, కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తూ ఉంటుంది. అయితే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే, పోలీసులు కూడా ఏమి చేయలేక పోతున్నారని టిడిపి ఆరోపిస్తుంది. అందుకే ఈ విషయం పై టిడిపి కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి తిరుపతిలో ఉన్న టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్ర కుమార్ ని, ఢిల్లీ పంపించింది. ఈ రోజు ఉదయం ఢిల్లీలో టిడిపి ఎంపీలు, నిన్న జరిగిన ఘటన పై ఫిర్యాదు చేయనున్నారు.

cbn 13042021 2

ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ విషయం చెప్పి, చంద్రబాబు భద్రతతో పాటుగా, ఎన్నికల్లో ఇలా అయితే స్వేచ్చగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉండదు అని, పారా మిలిటరీ బలగాలతో ఉప ఎన్నికలు జరగాలి తిరుపతి ఉప ఎన్నికలు సెంట్రల్ పారా మిలిటరీ బలగాల ఆధ్వర్యంలో జరగాలని చంద్రబాబునాయుడు మాటగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. స్థానిక పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల వైఫల్యం ప్రత్యక్ష్యంగా కనిపించిందన్నారు. నిన్న జరిగిన రాళ్ల దా-డిపై పోలీసుల సమాధానం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ ఫోర్స్ నిఘాలో ఎన్నికలు జరగాలని కోరనున్నారని నిన్న చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ కేంద్ర బలగాలు వస్తే, ఇక్కడ మంది బలంతో, బుల్ డోజ్ చేయాలని చూస్తున్న వైసీపీకి , ఇది అతి పెద్ద దెబ్బగానే చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే, చంద్రబాబు పై జరిగిన దా-డి పై కేంద్ర హోం శాఖకు కూడా ఈ విషయం తీసుకుని వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read