ఏపి తెలంగాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి నుంచి పడిగాపులు కాసి, సహనం కోల్పాయారు, విద్యార్దులు, ఉద్యోగులు. దాచేపల్లి మండలం, పొందుగుల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల పై రాళ్ళ దాడి చేసారు ప్రజలు. దీంతో పోలీసులు కూడా వారి పై లాఠీచార్జ్ చేసారు. ఈ పరిణామంతో, పొలేసులు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చేతిలో డబ్బులు లేక, ఆకలితో, నిన్నటి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నమాని ఆవేద వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో పంపెసరని, సొంత ఊరికి వెళ్లి, ఎలా గోలా బ్రతుకుతాం అని అంటున్నారు. నిన్నటి నుంచి ఓపిక పట్టిన ప్రజలు, ఈ రోజు సాయంత్రం జగన్ ప్రెస్ మీట్ పెట్టి, ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ఇక ఎవరినీ లోపలకు రానివ్వం అని చెప్పటంతో, బొర్డర్ లో ఉన్న ప్రజలు రెచ్చిపోయారు.

నిన్న మధ్యానం నుంచి అక్కడ పడిగాపులు కాసిన వారు, సహనం కోల్పాయారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు- ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంత మంది పోలీసులకు తలకాయలు పగిలాయి. అలాగే, పోలీసులు చేసిన లాఠీ చార్జ్ తో, ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. నిన్నటి నుంచి ఈ సమస్య పరిష్కారం చెయ్యకుండా, తాత్సారం చేస్తూ రావటంతో, చివరకు పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు మొండి పట్టుదలకు వెళ్ళటంతో, చివరకు పోలీసులు, ప్రజలు కొట్టుకునే దాకా పరిస్థితి వచ్చింది.

చీకటి పడటంతో, లైట్లు లేకపోవటంతో, ఎవరు దాడి చేసారో తెలియని పరిస్థితి. ఇరువురు దాడులు చేసుకోవటంతో, అక్కడ ఉన్న వాహనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఎట్టకేలకు పరిస్థితి అదుపులోకి తెచ్చిన పోలీసులు. సరిహద్దులో ముళ్ళ కంచె వేసారు. ఎట్టి పరిస్థితి లోను, లోపలకు వదిలే ప్రసక్తే లేదని, తిరిగి తెలంగాణాకు వెళ్ళిపోవాలని, పోలీసులు అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే, ఎక్కడకి దారి తీస్తుందో చూడాలి. మరోవైపు ఏపీ- తెలంగాణ బార్డర్‌ గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పరిస్థితి మెరుగైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read