ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు నానాటికి క్షీణిస్తున్నాయి. అధికార పార్టీ తప్పులు ప్రశ్నిస్తే చాలు, దా-డు-లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోడ్డులు బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నేతలు సరి చేసే ప్రయత్నం చేస్తే, వారినే తరిమి కొట్టారు వైసీపీ మూకలు. ఇప్పుడు అక్రమాలు ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాని చం-పే-సే ప్రయత్నం చేసారు. ఆయన కారుని ఆపిన వైసిపీ మూకలు, ఆయన కారు పై రాళ్ళ దా-డి చేసారు. దీంతో, కారు అద్దాలు పగిలిపోయాయి. దేవినేని ఉమాకు ఏమైనా గాయాలు అయ్యాయో లేదో ఇంకా తెలియలేదు. అయితే ఈ దా-డి వెనుక స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆగడాలు దేవినేని ఉమా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు కాబట్టే ఇలా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ రోజు జరిగిన సంఘటన విషయానికి వస్తే, నియోజకవర్గంలో ఎప్పటి నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుందని, దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఇష్టం వచ్చినట్టు కొల్లగొడుతున్నారు అంటూ, గతంలో కూడా దెవినేని ఉమా నిరసన తెలియ చేసారు. ఈ రోజు కూడా ఈ క్రమంలోనే, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళారు.

uma 27072021 2

అయితే అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి, తిరిగి వస్తున్న సమయంలో జి.కొండూరు మండలం గడ్డమణుగ వద్ద, దేవినేని ఉమా ప్రయాణిస్తున్న కారుని వైసిపీ అల్లరి మూకలు ఆపాయి. వెంటనే ఉమా వాహనం పై రాళ్ళ దా-డి చేసారు. ఈ క్రమంలోనే ఆయన వాహనం అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ పరిశీలించి తిరిగి వస్తూ ఉండగా ఈ దా-డి జరిగింది. అయితే దేవినేని ఉమాని చంపటానికే ఒకేసారి వంద మందికి పైగా వచ్చి రాళ్ళ దాడి చేసారని టిడిపి ఆరోపిస్తుంది. తన అక్రమాలు బయట పడుతున్నాయనే అసహనంతోనే, వసంత కృష్ణ ప్రసాద్, ఈ ఆగడాలకు పాల్పుతున్నారని టిడిపి ఆరోపిస్తుంది. అయితే ఈ సంఘటన చీకటి పడిన తరువాత జరగటం, ఈ విషయం తెలియటంతో, టిడిపి, వైసిపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవటంతో, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది. అయితే ఇప్పటికీ పోలీసులు రాకపోవటంతో, టిడిపి నేతలు, కార్యకర్తలు ఉమాకి రక్షణగా నిలబడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read