కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా రోజులు తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. గతంలో మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆవ భూములు స్కాం, ఇసుక, మద్యంలో జరుగుతున్న అక్రమాల పై మాట్లాడారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులను డీ కొట్టే అంశం పై, అమరావతి భూములు పై, జగన్ కేసులు పై తదితర అంశాల పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు వేల్లదిన్కాహారు. ముందుగా ఈ క-రో-నా సమయంలో కోర్టులు బౌతికంగా పని చేయటం లేదు కాబట్టి, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే కేసులు నడుస్తున్నాయని, దీనికి కొనసాగింపుగా వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ తానూ చీఫ్ జస్టిస్ కు ఉత్తరం రాసినట్టు చెప్పారు. ప్రజా ప్రతినిధుల పై కేసులు విచారణ మొదలు కాబోతుంది కాబట్టి, ఈ అంశం పై ప్రతి విషయం ప్రజలకు తెలియాలని, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, అందుకే కోర్టులలో జరిగే విషయాలు లైవ్ టెలికాస్ట్ చేయాలని తాను చీఫ్ జస్టిస్ కి సూచించినట్టు ఉండవల్లి తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ విదేశాల్లో ఉందని, మనకు కూడా ఉంటె బాగుటుందని, తాను లేఖ రాసిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు. ఇక మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు జగన్ ప్రభుత్వం, కోర్టుల విషయం పై చేస్తున్న దా-డి విషయంలో కూడా ఉండవల్లి స్పందించారు.

జడ్జిల పై లేఖలు రాయటం కొత్త కాదని ఉండవల్లి అన్నారు. కానీ ఆ లేఖను ఇలా బహిర్గతం చేయటం తప్పు అని, దీని పైనే ఇప్పుడు చర్చ జరుగుతుందని అన్నారు. ఆ లేఖలో ఉన్న అంశాలు ప్రజల్లో చర్చ అవ్వాలని లేఖ మీడియాకు ఇవ్వటం తప్పా, ఒప్పా అనేది చర్చ అని అన్నారు. కేంద్రం తలుచుకుంటే, ఇలాంటివి కట్టడి చేయవచ్చని ఉండాల్లి చెప్పారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే కోర్టు తీర్పుల పై మొదట అసహనం వ్యక్తం చేస్తే, తరువాత తెలుసుకుని, చట్టాలకు లోబడి పాలన చేసారని, కోర్టులతో ఘ-ర్షణ పడలేదని, అలాగే రాజశేఖర్ రెడ్డికి కూడా అనేక వ్యతిరేక తీర్పులు వచ్చినా, పోరాడారే కానీ, ఘ-ర్షణ పడలేదని చెప్పారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న చర్చ హుందాగా జరిగితే ఉపయోగం ఉంటుందని అన్నారు. న్యాయ వ్యవస్థకు, శాసనవ్యవస్థకు ఘ-ర్షణ మొదలైతే, రాష్ట్రము అల్ల-కల్లోలం అవుతుందని అన్నారు. కోర్టుల పరువు తీయాలనుకుంటే, కోర్టులకు ఏమి అవుతుందని ప్రశ్నించారు ? ఎక్కడైనా కోర్టులు ఇచ్చే తీర్పులు చట్టాలకు లోబడి ఉంటాయని అన్నారు. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, ప్రశ్నించకూడదు అంటే ఎలా అన్నారు. ఇక అమరావతి భూముల పై మాట్లాడుతూ, అక్కడ రాజధాని వస్తుందని తెలిసి, ఎవరైనా కొంటారు, జడ్జీలు కొంటే తప్పు ఏంటి ? జడ్జి కూతురు కొంటే తప్పు ఏంటి ? అక్కడే రాజధాని వస్తుందని ప్రచారం జరిగింది కొన్నారు, ఇప్పుడు రాజధాని లేదు అంటే కొంత మంది అమ్ముకోవటం లేదా ? అని ఉండవల్లి ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read