ఏపి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల వింత పోకడ చూపిస్తుంది. అన్ని వైపుల నుంచి జగన్ పై విమర్శలు వస్తున్న వేళ, జగన్ ను కాపాడటానికి, జగన్ ట్రబుల్ షూటర్,మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత రంగంలోకి దిగారు. ఆంధ్రపదేశ్ లో తాజాగా ఉద్యోగులకు వచ్చిన పరిస్తితి ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని చెప్తూనే, ఎక్కడైనా జీతాలు పెంచమని సమ్మె చేస్తారు కాని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొత్త జీతాలు తమకు వద్దని పాత జీతాలే ఇవ్వమని సమ్మె చేయడం, చూస్తుంటే ఉద్యోగుల దయనీయ పరిస్తితి అర్ధమవుతుందని ఉండవల్లి ఆరోపించారు. మరోపక్క ఉద్యోగస్తులు మాత్రం PRC పై తాము ఎట్టి పరిస్తితుల్లో తగ్గేదే లేదని, ప్రబుత్వం తో కూడా ఎటువంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సందర్బంలో ఉండవల్లి ఉదోగులకు ఒక లేఖ రాసారు. వైసిపి ప్రబుత్వం ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఉద్యోగస్తులు దయ చేసి సమ్మె ను విరమించండి అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు . ఒకవేళ ఈ కొత్త PRC ఇస్తే జగన్ ప్రబుత్వం మీద అదనంగా రూ.10,247 కోట్ల భారం పడుతునందని , ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే పరిస్థితి లేదని ఉద్యోగస్తులకు లేఖ విడుదల చేసారు. మొత్తానికి జగన్ ఉద్యోగుల మీద చిమ్ముతున్న విషానికి, ఉండవల్లి కూడా రంగంలోకి దిగారు. ఉద్యోగులను దోషులుగా చూపించే విధంగా, సుతి మెత్తగా ప్లాన్ చేస్తూ, లేఖ విడుదల చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read