టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ టీవీ9 పై సంచలన ఆరోపణలు చేసారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ ఆరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడుతూ టీవీ9 పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లేందుకు సిద్ధం అవుతుందని ఉత్తమ్ విమర్శించారు. ఈ రెండు రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలనీ, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులను టీవీ9 వాహనాల్లో, పోలీస్ కార్లలో, అంబులెన్సుల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

uttam 05122018

మరో పక్క రెండు రోజుల క్రిందట టీవీ9 ఒక సర్వే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీవీ9 సోమ‌వారం నాడు ప్ర‌సారం చేసిన స‌ర్వే బోగ‌స్ సర్వే అని, ఈ లెక్క‌లే చెబుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది కేవ‌లం ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం చేశారో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చని అన్నారు. "ఇప్పుడు టీవీ9 యాజ‌మాన్యం కూడా ఎవ‌రి చేతుల్లో ఉందో అంద‌రికీ తెలుసు. అస‌లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఈ స‌ర్వే ప్ర‌సారం చేసిన‌ట్లు తేలిపోయింది. ఈ లెక్క‌లు చూస్తుంటే. కేవ‌లం తాము కోరుకున్న వారికి ప్ర‌యోజ‌నం చేకూర్చిపెట్ట‌డం కోసం రాష్ట్రంలో లేని అసెంబ్లీ సీట్ల‌ను కూడా టీవీ9 తీసుకొచ్చిందా?" అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

uttam 05122018

మరో పక్క ఎన్నికల్లో భారీ బద్రత ఏర్పాటు చేసమాని పోలీసులు అంటున్నారు. హైదరబాద్ లోని, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 మంది ఏసీపీ స్ధాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. అంతేకాకుండా 3,911 పోలీస్‌ స్టేషన్లకు 60 షాడో టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ రోజు 518 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక కేంద్రాల్లో భారీగా పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు రూ.27 కోట్ల 3 లక్షల 76 వేలు పట్టుకున్నామని, 2 కోట్ల 41 లక్షలు విలువచేసే బంగారం సీజ్‌ చేశామని పేర్కొన్నారు. రెండు లక్షల విలువైన మద్యం సీజ్‌ చేశామని అంజనీ కుమార్‌ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read