తెలుగుదేశం పార్టీ గ‌ళం ప‌ట్టాభి. వైసీపీ అవినీతి, అక్ర‌మాల‌పై గ‌ర్జించే అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్. ఆ వాయిస్ ని త‌ట్టుకోలేక వైసీపీ దా-డు-లు చేయించింది. నీచ‌మైన ట్రోలింగ్ పాల్ప‌డింది. అయినా ఒక్క ఇంచు కూడా త‌గ్గ‌ని నిజాయితీ, టిడిపి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో కూడిన నైజం ప‌ట్టాభిది. దాడుల‌తో భ‌య‌పెట్ట‌లేక‌పోయారు. అక్ర‌మ‌కేసుల‌తో లొంగ‌దీసుకోలేక‌పోయారు. బూతులతో ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీయాల‌నుకున్నారు. తెలుగుదేశం ప‌ట్టాభి పంతం ముందు నిల‌వ‌లేక‌పోయారు. అందుకే ఇప్పుడు ప‌రువున‌ష్టం పేరుతో పట్టాభి గ‌ళానికి క‌ళ్లెం వేయాల‌ని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. సంకల్ప్‌ సిద్ధి సంస్థ కేసులో పట్టాభి చేసిన త‌న‌పై చేసిన ఆరోపణలతో ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం వాటిల్లింద‌ని ఈ కేసుని వంశీ దాఖ‌లు చేశారు. సంకల్ప్‌ సిద్ధి గొలుసుక‌ట్టు స్కీం పేరుతో దాదాపు వెయ్యి కోట్ల‌కు పైగానే దోచేసిన మోస‌గించిన దానిపై కేసులు న‌మోద‌య్యాయి. సంక‌ల్ప‌సిద్ధి భాగ‌స్వాములైన గుత్తా  వేణుగోపాలకృష్ణ, గుత్తా కిరణ్‌లు కొడాలి నాని, వల్లభనేని వంశీల బినామీలని పట్టాభి ఆరోపించారు. సంక‌ల్ప‌సిద్ధిలో పెట్టిన సొమ్ముని వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని వాడుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  దీనిపై అప్ప‌ట్లోనే డీజీపీని కలిసి వంశీ ఫిర్యాదు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల‌ని, లేదంటే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వ‌ల్ల‌భ‌నేని ప‌ట్టాభికి నోటీసులు పంపించారు. తాజాగా పరువునష్టం దావా వేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read