ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న కుటుంబాలు పరిటాల - వంగవీటి. ప్రస్తుతం రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి. వంగవీటి రాధా, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గునకపోయినా, ఆయన మాత్రం ఇప్పటికీ టిడిపితోనే ఉన్నారు. వంగవీటి రాధా అమరావతి ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ తరుణంలోనే, వంగవీటి రాధా అమరావతి పాదయాత్రలో పాల్గునటానికి, రాజమండ్రి వచ్చారు. అయితే ఇదే పాదయాత్రలో పాల్గునటానికి పరిటాల శ్రీరాం కూడా వచ్చారు. నిన్న వంగవీటి రాధా, పరిటాల శ్రీరాం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇరువురూ ఒంటరిగా మాట్లాడుకోవటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారి ఇరువురు నేతలు కలుసుకున్నారు. గతంలో కూడా వంగవీటి రాధాపై రెక్కీ జరిగినప్పుడు, శ్రీరాం అండగా నిలబడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read