సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్ దయాల్ శర్మ, రామ్ మనోహర్ లోహియా, ఉమేష్ గుప్తా వంటి ఉద్దండుల కూర్చున్న రాజ్యసభలో... ప్రశ్నించే విధంగా జీవితం గడుపుతున్న ఏ2 విజయసాయిరెడ్డి సభ్యునిగా ఉండటం రాష్ర్ట ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుడూ.. ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని దేశ ప్రజలందరికి తెలుసు. ఆయన తన కంట్లో దూలం ఉంచుకుని ఎదుటి వారి కల్లలో నలకను వెతకటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి జీవితమే అవినీతి మయం. లాంబ్రెక్టా స్కూటర్ మీద తిరిగే విజయసాయిరెడ్డి జగన్ పంచన చేరి ఏ2 గా రూపాంతరమెత్తాక కోట్లకు పడగలెత్తారు. 11 చార్జిసీట్లతో రూ. 43 వేల కోట్లు ఏ1,ఏ2 మీద సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసుల్లో విచారణ పూర్తయితే విజయసాయిరెడ్డి రాజస్యసభలో ఉంటారో, సెంట్రల్ జైళ్లో ఉంటారో ఆయనకే తెలియదు. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. చంద్రబాబు ఏం చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటి, రింగ్ రోడ్డు నిర్మించింది, సైబారాద్ నగరం నిర్మించి వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు కాదా?

బిల్ గేట్స్ ని హైదారాబాద్ కి తీసుకువచ్చి సామాన్య సర్పంచ్ పక్కన కూర్పచోపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు . తాను రాష్ర్టపతి అవ్వడానికి కారణం చంద్రబాబే అని అబ్దుల్ కలాం తన పుస్తకాల్లో రాశారు. దేశంలో ప్రతిపక్షాలన్నింటి ఏకం చేసింది చంద్రబాబు కాదా? చంద్రబాబు గురించి ప్రశ్నించే నైతిక జీవితమా విజయసాయిరెడ్డిది? విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్బంగా విశాఖలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలతో రాష్ర్టంలోని ఫించన్ లబ్డిదారులకు ఒక నెల పింఛన్ ఇవ్వొచ్చు. ఏం సేవ చేశారని విజయసాయిరెడ్డికి ప్లెక్సీలు కట్ట్టారో అర్దం కావటం లేదు. సూట్ కేసు కంపెనీలు సృష్టించినందుకు, విశాఖలో స్థలాలు కొట్టేసినందుకా ప్లెక్సీలు కట్టింది. విజయసాయిరెడ్డి విశాఖలో ఒక ప్రత్యేక అవినీతి చరిత్ర సృష్టించుకున్నారు. అంబులెన్స్ కుంభకోణంలో రూ. 307 కోట్లు కొట్టేశారు. దాని గురించి కనీసం ఇక్క ట్వీట్ కూడా విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు. ఎన్టీఆర్ కి భారతతర్న చంద్రబాబు ఎందుకు ఇప్పించలేకపోయారని విజయసాయిరెడ్డి అంటున్నారు.

కృష్ణా జిల్లాకి ఎన్టీ ఆర్ పేరు పెడతానని గతంలో జగన్ అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయి 14 నెలలు గడిచినా పేరెందుకు పెట్టలేదో విజయసాయిరెడ్డి చెప్పాలి? జగన్ కి తెలియకుండా బెంగులూరు లో విజయసాయిరెడ్డి కూడబెట్టిన ఆస్తుల చిట్టా పైల్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కి ఇఛ్చారు. దానికి భయపడి విజయసాయిరెడ్డి ఈ మద్య 25 రోజులు ఎవరకి కనపడకుండా దాక్కున్నారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారన్న భయంతో జగన్ , తన లెక్కచూపని జగన్ కొట్టేస్తారన్న భయంతో విజయసాయిరెడ్డి ఉన్నారు. విజయసాయిరెడ్డిన మించిన అబద్దాల కోరు. దొంగ ఆడిటర్, ఎవరూ లేరు. విజయసాయిరెడ్డికి చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటని వర్ల రామయ్య విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read