వైసీపీ నేతలకు దమ్ము, దైర్యం ఉంటే చంద్రబాబు, జగన్‌ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ...ప్రతిసారి సాక్షి పేపర్‌ గురించి మాడాలంటే సిగ్గుపడుతున్నాం. ఐటి దాడుల్లో రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్ద దొరికాయంటూ సాక్షి పేపర్‌, టీవీ, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారు. కానీ వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారానికి ఐి శాఖ ఇచ్చిన పంచనామా వారికి చెంపపెట్టులా ఉంది. దీంతో వైసీపీ నేతలు, తేలు క్టుిన దొంగల్లా ఉన్నారు. సాక్షి మీడియాకు, వైసీపీ నేతలకు సవాల్‌ విసిరుతున్నా.. ఆ డబ్బు చంద్రబాబు గారి ఎకౌంటు లోకి ఎలా వచ్చిందో చెప్పాలి. జగన్‌లా చంద్రబాబు క్విడ్‌ ప్రోకో ద్వారా, జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించలేదు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల్ని ప్రతి సంవత్సరం ప్రకిస్తున్నారు. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా..తీసుకోమని వైసీపీ నేతలకు సవాల్‌ విసురుతున్నారు. చంద్రబాబు ఆస్తులపై, జగన్‌ అవినీతి ఆస్తులపై బహిరంగ చర్చకు టీడీపీ తరపున నేను వస్తా...వైసీపీ నేతలెవరికైనా చర్చకు వచ్చే దమ్ముందా?

ఏంటైలో అయినా..ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్దం. జగన్‌ తన తస్తులు ప్రకించడానికి ఎందుకు వణుకుతున్నారు. ఐటి దాడులపై సాక్షి మీడియా చేసిన అసత్య ప్రచారాన్ని మిగిలిన చానళ్లు, పత్రికలు ఛీ కొట్టాయి. వైసీపీకి రూ. 150 కోట్లు ముడుపులు ఇచ్చినందుకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారు. కాదని చెప్పే దైర్యం వైసీపీ నేతలకుందా? జగన్‌ ఎప్పుడు నిజాలు చెప్పరు. కోర్టులో కూడా ప్రతిశుక్రవారం నిజాలు చెప్పరు. పెద్ద నోట్ల ద్వారా అవినీతి జరుగుతోందని రూ. 2 వేల నోట్లు, 500 నోట్లు రద్దు చేయాలని కోరిన వ్యక్తి చంద్రబాబు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎన్ని కంపెనీలను బెదిరిస్తే వచ్చిందో చెప్పగలరా? పీకల్లోతు అవినీతిపై కూరుకుపోయిన వైసీపీ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. 2004 కు ముందు జగన్‌ ఆస్తులెంత ఇప్పుడెంత? అప్పుడు జగన్‌ క్టిన ఇన్కమ్ టాక్స్ ఎంత, ఇప్పుడున కడుతున్న ఇన్కమ్ టాక్స్ ఎంత? మంత్రి బుగ్గన అయినా ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలి.

జగన్‌ ఇంత డబ్బు ఎలా సంపాదించారు. ఏదైనా కంపెనీలో పనిచేశారా? కేవలం క్విడ్‌ప్రోకో , అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించారు. జగన్‌ అక్రమాస్తులపై చర్చకు సాక్షి చానల్‌కే వస్తా..సీనియర్‌ జర్నలిస్టును న్యాయనిర్ణేతగా పెట్టండి. చంద్రబాబు ఆస్తుల గురించి నేను చెప్తా...జగన్‌ ఆస్తుల గురించి నేనడిని ప్రశ్నలకు బుగ్గన సమాధానం చెప్పాలి. నవంబర్‌ 11.2019లో జరగిన ఐటి దాడి గురించి ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్లు గాడిదలు కాసారా? వైసీపీ నేతలు తమ కళ్లలో దూలం పెట్టుకుని ఎదుటి వారి కంటిలో నలుసును వెతుకున్నారు. ప్రతి సవంత్సరం చంద్రబాబు తన తస్తులు ప్రకిస్తుంటే జగన్‌ ఎందుకు ప్రకిచంట లేదో ప్రజలే జగన్‌ని అడగాలి. సాక్షి పత్రికలో రాస్తున్న అబద్దాల గురించి చైర్మన్‌ భారతిరెడ్డికి నేను బహిరంగం లేఖ రాశా. సాక్షికి విలువలు లేవు. సాక్షి నీచస్ధితికి దిగజారింది. ఇకనైనా సాక్షిలో మార్పు వచ్చిందేమో అని లేఖరాశా. జగన్‌ సొంత మనుషుల ఇన్‌ప్రా కంపెనీలకు ఎన్ని కోట్లు జమయ్యాయో చెప్పగలరా? జగన్‌కి చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇకనైనా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read