బాలయ్య ఎస్వీ రంగారావుని ఏమ‌న‌కుండానే కాపుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని వైసీపీ పేటీఎం బ్యాచులు బాగా హ‌డావిడి చేశాయి. బాల‌య్య అక్కినేని తొక్కినేని అన్నారు కాబ‌ట్టి దానికంటే ముందు ఎస్వీ రంగారావు పేరూ ఉంద‌ని..అందుకు కాపుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని వైసీపీ కోసం ప‌నిచేసే బాడుగ కాపు సంఘాలు ఆందోళ‌న‌బాట ప‌ట్టాయి. ఎస్వీ రంగారావు వార‌సులు అసలు బాల‌య్య ఏమ‌న్నార‌ని హ‌డావిడి చేస్తున్నారు కుల‌సంఘాల పేరుతో అని గ‌డ్డి పెట్టేసరికి నోరుమూసేశారు. బాల‌య్య ఏమీ అన‌కుండానే కాపుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని వ‌చ్చిన పేటీఎం బ్యాచీ  వైసీపీకి చెందిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి కాపు రౌడీలంటూ అమ్మ‌నాబూతులు తిట్టినప్పుడు ఎందుకు మ‌నోభావాలు దెబ్బ‌తినలేద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. కాపుల్ని రౌడీలంటూ తిట్ట‌డ‌మే కాకుండా ప్రభుత్వ విప్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని కొట్టేందుకు కూడా ఎగ‌బ‌డ్డారు వెలంప‌ల్లి. కాపు రౌడీల్లారా మీ అంతుచూస్తాన‌ని వైసీపీ ఎమ్మెల్యే బెదిరించినా వైసీపీకి కాపు కాసే ఏ కాపు మ‌నోభావాలు ఎందుకు దెబ్బ‌తిన‌లేద‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read