2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా వ్యవసాయ ఆదయ రాష్ట్రం అని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు గారు ట్రాక్ రికార్డు, ఆయన బ్రాండ్ ఇమేజ్ పుణ్యమా అని రాష్ట్రానికి ఎక్కువగా పరిశ్రమలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు వందల కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులను కాదు అనుకుని కూడా కొన్ని కంపెనీలు ఏపి వచ్చాయి అంటే, అది కేవలం చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ వల్లే. దానికి ప్రత్యెక ఉదాహరణ కియా పరిశ్రమ. తరువాత ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి ప్రజలు ఏమి అద్భుతాలు కోరుకోలేదు. చంద్రబాబు గారి వేసిన పునాదిని, ముందుకు తీసుకుని వెళ్తే చాలు అనుకున్నారు. అనేక కంపెనీలు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకుని, శంకుస్థాపనలు చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ ఫాలో అప్ చేసి, సరైన వాతవరణం కలిపిస్తే చాలు, ఆ కంపెనీలు ఈ పాటికే ఏపి ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేవి, యువతకు ఉద్యోగాలు కూడా వచ్చేవి. అయితే ఎందుకో కాని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. అంతే కాక, అనే కార్యక్రమాలు పారిశ్రామిక రంగం పై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో కొత్త పెట్టుబడులు సంగతి తరువాత, ఇప్పటికే ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కు వెళ్ళిపోవటం మొదలు పెట్టాయి.

vem 25102021 2

అనేక కంపెనీలు ఇలా వెనక్కు వెళ్ళిపోవటం మనం చూసాం. వెళ్ళిపోతే పర్వాలేదు కాని, పుండు మీద కారంలాగా, తెలంగాణా రాష్ట్రానికి వెళ్లి మనలను వెక్కిరిస్తున్నాయి. ఏపి లాస్, తెలంగాణా గైన్ అని ఊరికే అనలేదు. ఇలాంటి వాటి వల్లే అన్నారు. తాజాగా చంద్రబాబు తెచ్చిన VEM టెక్నాలజీస్ అనే కంపెనీ తెలంగాణాకు వెళ్ళిపోయింది. 2018లో ఈ కంపెనీ శంకుస్థాపన కూడా చేసుకోవటం మరో విశేషం. పశ్చిమగోదావారి జిల్లా, ఏలూరు సమీపంలో, ఈ కంపెనీ నిర్మాణానికి సిద్ధం అయ్యింది కూడా. ఏరో స్పెచ్ కు సంబదించిన పరిశ్రమ అంటే, ఎంత భవిష్యత్తు ఉంటుందో ఊహించండి. 2,000 కోట్ల పెట్టుబడి.....6,000 ఉద్యోగాలు... 325 ఎకరాలలో ఈ కంపెనీ మన ఏపిలో, మన గోదావరి జిల్లాలో వచ్చేది. నేడు ఇదే కంపెనీ ఇప్పుడు తెలంగాణాకు వెళ్ళిపోయింది. అక్కడ కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కూడా అయిపొయింది. ఏపి ప్రజలు ఏమి కోల్పోతున్నారో, అర్ధం అవుతుందో లేదో కానీ, మనకు వాలంటీర్ ఉద్యోగాలు, మటన్ కొట్టు ఉద్యోగాలు, బియ్యం వ్యాన్ ఉద్యోగాలు మాత్రమే మిగిలేల ఉన్నాయి. అలోచించి ఆంధ్రుడా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read