వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి అంటే సోష‌ల్ మీడియాలో ఒక బ్రాండ్. బూతులు, రోత ట్వీట్లు, పోస్టుల‌కి విజ‌యాసాయిరెడ్డి హ్యాండిల్ బాగా ఫేమ‌స్. లెక్క‌కుమించిన ప‌ద‌వులున్నా వైసీపీ సోష‌ల్మీడియా ఇన్చార్జిగా సాయిరెడ్డి బూతు కూత‌లు, ``ఏ`` స‌ర్టిఫికెట్ రెట్ట‌ల‌తో నిత్యం అంద‌రితోనూ ఛీకొట్టించుకుని వార్త‌ల్లో ఉండేవారు. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయిరెడ్డి నుంచి ఒక్కో పోస్టూ పీకేస్తూ వ‌చ్చిన జ‌గ‌న్ రెడ్డి, ఓన్లీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిగా మిగిల్చారు. సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డికి అప్ప‌గించారు. బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయిన‌ట్టు, త‌న అల్లుడు వ‌ర‌సైన తార‌క‌ర‌త్న మ‌ర‌ణం సంద‌ర్భంలో సాయిరెడ్డికి జ్ఞానోద‌యం అయ్యింది. టిడిపి గొప్ప‌త‌న‌మేంటో అర్థ‌మైంది. త‌న బిడ్డ అలేఖ్య‌రెడ్డి అన్న సంగ‌తి మ‌రిచిపోయి వైసీపీ సోష‌ల్మీడియా తార‌క‌ర‌త్న మ‌ర‌ణంపై విషం చిమ్మ‌డంతో సాయిరెడ్డి తీవ్ర మ‌నోవేద‌న‌కి గుర‌య్యార‌ని స‌మాచారం. త‌న ప‌ద‌వులు పీకేసినా దానికంటే ఎక్కువ బాధ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలో సాయిరెడ్డి మ‌నుషులు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రెడ్డితో స‌హా అంద‌రినీ స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి టీము తొక్కేసింద‌ని తెలుస్తోంది. దీంతో సాయిరెడ్డి పూర్తి వైరాగ్యంలోకి వెళ్లిపోయార‌ని స‌న్నిహితులు చెబుతున్న మాట. ట్వీట్లు, పోస్టులు కూడా పూర్తిగా మారిపోయాయి. అంత‌ర్జాతీయ‌, జాతీయ వ్య‌వ‌హారాలు-ఆవు క‌త‌లే రోజూ పోస్టు చేస్తున్నారు అడ్మిన్. వైసీపీ నేత‌ల పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అద‌నం. రోత పోస్టులు అస్స‌లు వేయ‌డంలేదు. మ‌రోవైపు గ‌తంలో ఇంటూరి ర‌వికిర‌ణ్ బరితెగింపు మార్ఫింగ్ పోస్టులు కూడా సాయిరెడ్డి అక్కౌంట్ల నుంచి షేర‌య్యేవి. సైరా పంచ్ పేరుతోనూ, పొలిటిక‌ల్ పంచ్ పేరుతో అస‌భ్య‌పు పోస్టుల‌నూ సాయిరెడ్డి ఖాతా నుంచి వేసేసేవారు. ఇప్పుడు సాయిరెడ్డి సోష‌ల్ మీడియా ఖాతాలు పంచ్ నుంచి బ‌య‌ట‌ప‌డి గ్రేట్ ఆంధ్రా వెంక‌ట‌రెడ్డికి చేరాయ‌ని తెలుస్తోంది. సాయిరెడ్డి హ్యాండిల్‌లో పోస్టు చేసినవే గ్రేట్ ఆంధ్ర‌లోనూ అక్ష‌రం పొల్లు పోకుండా పోస్ట‌వుతున్నాయి. దీంతో సాయిరెడ్డి రాత‌లే కాదు సోష‌ల్మీడియా టీము కూడా మారిపోయింద‌ని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read