జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వి-వే-క, గత ఏడాది, హ-త్య కాబడిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. అప్పట్లో ఇది చంద్రబాబు చేపించాడు అంటూ, హోరెత్తించిన జగన్, సిబిఐ ఎంక్వయిరీ కావలి అంటూ హడావడి చేసారు. అయితే, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి, 8 నెలలు దాటి, 9 వ నెలలోకి వచ్చినా, ఇప్పటి వరకు, సిబిఐ ఎంక్వయిరీ కోరలేదు. మరో పక్క, కావాలని రాజకీయ ప్రత్యర్ధులను టార్గెట్ చెయ్యటంతో, వారు, ఈ కేసులో మాకు సిబిఐ ఎంక్వయిరీ కావాలి అంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి అంటూ, వి-వే-కా సతీమణి సౌభాగ్యమ్మ, తెలుగుదేశం నేత బీటెక్‌ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా హైకోర్ట్ లో పిటీషన్లు వేసారు. ఈ కేసుల పై, ఇప్పటికే వాదనలు జరగగా, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదు, అంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇప్పటికే మా ప్రభుత్వం సిట్ వేసిందని, వారు ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు.

అందుకే దీని పై, సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు అంటూ, జగన్ ప్రభుత్వం, హైకోర్ట్ ముందు వాదించింది. అయితే, ఈ రోజు ఈ కేసులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. తనకు కొంత మంది పై అనుమనాలు ఉన్నాయి అంటూ, వి-వే-క కూతురు సునీత, హైకోర్ట్ లో మరో పిటీషన్ వేసారు. ఒక పక్క జగన్ సిబిఐ వద్దు అంటుంటే, ఏకంగా తన కుటుంబ సభ్యులే, మరో కుటుంబ సభ్యుల పై అనుమానాలు ఉన్నాయి అంటూ, ఈ రోజు కోర్ట్ లో పిటీషన్ వేసారు. 3 సిట్ టీంలు ఇప్పటి వరకు వేసినా, ఏమి తేలలేదని, అందుకే సిబిఐ విచారణ కావాలని కోరారు. తనకు కొంత మంది పై అనుమానాలు ఉన్నాయి అంటూ, దాదపుగా 15 మంది పేర్లు కోర్ట్ కు ఇచ్చారు. అందులో అనూహ్యంగా, వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది. మిగతా పేర్లు, వాచ్ మెన్ రంగయ్య, ఎర్ర గంగి రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రెనివాస్ రెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్సై రామకృష్ణారెడ్డి, ఈసీ సురేంద్ర నాద్ రెడ్డి, మారెడ్డి రావేంద్ర నాద్ రెడ్డి, అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు ఉన్నారు.

ప్రతివాదులుగా ఏడుగురిని పిటిషన్ లో చేర్చిన సునీత. గతంలో సీబీఐ విచారణ జరిపించాలని తన సోదరుడు జగన్, తన తల్లి సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ వేసిన అంశాన్ని గుర్తుచేసిన వివేకానందరెడ్డి కుమార్తె. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని పిటిషన్ లో పేర్కొన్న డాక్టర్ సునీత. తాజాగా ఈ కేసు దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని పిటిషన్ లో ఆరోపణ. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి..ఇప్పుడు సీఎంగా ఉన్న తన సోదరుడు జగన్ నేరుగా సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వం తరపున ఎందుకు కోరట్లేదని ప్రశ్నించిన పిటిషనర్ . ఏపీ పోలీసులపై నమ్మకంలేదని అప్పట్లో పేర్కొని.. ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరిపించటం ఏమిటని ప్రశ్న. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే పరమేశ్వరరెడ్డి బామ్మర్ధి శ్రీనివాస్ రెడ్డి ఆ-త్మ-హ-త్య పై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్ సునీత. పో-స్టు-మా-ర్టం నివేదికలో శ్రీనివాస్ రెడ్డికి గా-యా-లు-న్నా-య-ని, ఆయన వి-షం తీసుకొని చ-ని-పో-లే-ద-నే అనుమానాన్ని వ్యక్తం చేసిన పిటిషనర్. అయితే ఈ కేసు పై, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసును సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించింది. అడ్వొకేట్‌ జనరల్‌ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read