మన రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకులు పత్రికల్లో వచ్చిన సమాచారం కానీ, తమకు తెలిసిన సామాచారం కానీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం పై విమర్శలు చేసారు అంటే, వెంటనే వారి ముందు పోలీసులు దిగిపోతారు. వారికి నోటీసులు ఇచ్చి, మీకు ఆ సమాచారం ఎక్కడిది, దీని పై తమకు మరింత సమాచారం ఇవ్వండి, తాము దర్యాప్తు చేస్తాం అంటూ, హడావిడి చేస్తూ, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. చివరకు డీజీపీ చంద్రబాబు గారికి కూడా లేఖ రాసి, వివరాలు అడిగారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు మన రాష్ట్రంలో గత పది రోజులుగా జరుగుతున్న ఈ రచ్చకు కూడా ఈ నోటీసులే. గంజాయి విషయం పై నల్గొండ పోలీసులు, విశాఖ రాగా, వారి పైనే గంజాయి మాఫియా దా-డి చేయగా, నల్గొండ పోలీసులు ఫైర్ ఓపెన్ చేసారు. దీని పై టిడిపి నేత నక్కా ఆనందబాబు మీడియా సమావేశం పెట్టి, ఇంత రచ్చ జరుగుతుంది అంటే,దీని వెనుక కచ్చితంగా వైసిపి నేతల హస్తం ఉందని, అందుకే పోలీసులని కూడా లెక్క చేయటం లేదని అన్నారు. అంతే వెంటనే నర్సీపట్నం నుంచి పోలీసులు గుంటూరు వచ్చేసారు. నక్కా ఆనంద బాబుకి నోటీసులు ఇచ్చారు. దీని పైనే పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి బోస్ డీకే అని సజ్జల అనటం, సాయంత్రం టిడిపి ఆఫీస్ ల మీద బీపీ పెరిగిన జగన్ మోహన్ రెడ్డి ఆత్మీయులు దా-డి చేయటం జరిగిపోయాయి.

dgp 27102021 2

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అంటే, ఇలాంటి నోటీసులు, కేవలం టిడిపి నేతలకే ఇస్తారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇలాంటి నోటీసులు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు విజయసాయి రెడ్డి మీడియా సమావేశం పెట్టారు. చాలా రోజుల తరువాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. ఈ మధ్య ఆయన అలిగారని, దూరం పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అ అలక తీరిందో ఏమో కాని, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు, లోకేష్ పై ఎదురు దాడి చేసారు. గంజాయి వ్యాపారంలో నారా లోకేష్ ఉన్నారని, అందరికీ తెలుసు అని అన్నారు. గంజాయితో లోకేష్ కి సంబంధాలు ఉన్నాయని అన్నారు. మరి అందరికీ నోటీసులు ఇచ్చినట్టే, డీజీపీ గారు పూర్తి ఆధారాలు తమకు ఇవ్వండి, లోకేష్ ప్రమేయం గురించి చెప్పండి అని, విజయసాయి రెడ్డికి నోటీసులు ఇస్తారా అనే ప్రశ్న వస్తుంది. రూల్ అఫ్ లా అంటే అందరికీ ఒకటే కాబట్టి, ఆధారాలు తీసుకుని, చంద్రబాబు, లోకేష్ పైన , డీజీపీ కేసు పెట్టచ్చు కదా ? మరి డీజీపీ గారు ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read