ఒక్కొక్కరికీ ఒక్కో గుర్తింపు ఉంటుంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా, ఒక గుర్తింపు ఉంది. తన హోదాని మరిచి, ఆయన పెట్టి వెకిలి ట్వీట్లు చాలా చండాలంగా ఉంటాయి. ఒక్కోసారి, సభ్య సమాజంలో, ఇలాంటి వారు ఎందుకు ఉన్నారా అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబు పుట్టిన రోజు నాడు పెట్టిన ట్వీట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ ని పావలా అంటూ, చిల్లరగా పెట్టిన ట్వీట్ కానీ, వెగుటు పుట్టిస్తుంది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, ఆడవారిని కూడా టార్గెట్ చేసారు. టిడిపి ఎమ్మల్యే గంటా శ్రీనివాస్ భార్యని, చౌదరి మేడం అంటూ, జుబుక్సాకరంగా ట్వీట్ చేసారు. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో, గంటా భార్యని, ‘గంటా సతీమణి చౌదరి మేడం' అంటూ హేళనగా ట్వీట్ చేసారు. సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులను గంటా భార్య నియమించారు అంటూ, ట్వీట్ చేసారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమెను "చౌదరి మేడం" అంటూ సంబోధించటం ఏమి సంప్రదాయమో మరి. విజయసాయి రెడ్డి, ఇలా రోజు రోజుకీ ఎందుకు దిగజారి ట్వీట్లు పెడుతున్నారో అర్ధం కావటం లేదు. ఆయన ఇంకా మారడా అని సామాన్య ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read