ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో, ఏదైనా తెలుగు పేపర్ లో, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వానికి కాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాని, ఏవైనా వ్యతిరేక కధనాలు వస్తే చాలు, ఆ పేపర్ ఎల్లో మీడియా అంటూ, ఒక ట్యాగ్ తగిలిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా వ్యతిరేకంగా రాస్తే చాలు, చంద్రబాబు రాపించాడు, అవి చంద్రబాబు పేపర్లు అంటూ, విరుచుకు పడిపోతుంది వైసీపీ. ప్రమాణస్వీకారం రోజే, అదే మీటింగ్ లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అంటూ, జగన్ మోహన్ రెడ్డి, పేర్లు పెట్టి మరీ ఆ పేపర్లకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇలాంటి ఉడత ఊపులు ఎన్నో చూసిన వాళ్ళు ఎందుకు బెదరుతారు ? ఇక పొతే, ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా జగన్ మోహన్ రెడ్డి పాలన పై అనేక వ్యతిరేక కధనాలు వచ్చాయి. ఏకంగా ఎడిటోరియల్స్ రాసి, జగన్ పాలన పై విరుచుకు పడింది, నేషనల్ మీడియా. దీంతో నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబుకి అమ్ముడు పోయింది అని, అది కూడా ఎల్లో మీడియా అంటూ, ప్రచారం మొదలు పెట్టింది వైసీపీ.

wsj 19022020 2

ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుని. కియా మోటార్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతుంది అంటూ, రాయటర్స్ అనే అంతర్జాతీయ మీడియా, కధనం వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక, ఆ కంపెనీ తమిళనాడు వెళ్ళిపోతుందని, ఆ కధనం సారంశం. దీంతో, రాయటర్స్ అనే అంతర్జాతీయ మీడియాకి కూడా, ఎల్లో మీడియా అనే ట్యాగ్ కొత్తగా తగిలించారు. ఇది ఇలా ఉండగానే, నిన్న అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ, ఒక వార్త రాసింది. భారత దేశంలో, సోలార్ పవర్ మొన్నటి దాకా ఎంతో బాగుండేది అని, తాజాగా మారిన పరిస్తితుల్లో, ఇప్పుడు సోలార పవర్ లో, భారత దేశం వెనుక పడింది అంటూ, ఒక వార్త వేసింది వాల్ స్ట్రీట్ జనరల్.

భారత దేశంలో సోలార్ పవర్ ఎందుకు పడిపోతుందో చెప్తూ, ఆంధ్రప్రదేశ్ విధానాలు కూడా ఒక కారణంగా రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఇండియాలో దక్షిణాదిన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మొన్నటి దాకా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఇక్కడ అధికంగా, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి, వాడకం కూడా జరిగేది. అయితే, ఈ రంగంలో చేసుకున్న ఒప్పందాలు, మళ్ళీ సమీక్షిస్తాం , మాకు తక్కువ రేటు కు ఇవ్వాల్సిందే అని అక్కడ ప్రభుత్వం చెప్పటంతో, ఈ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది అంటూ, వాల్ స్ట్రీట్ జనరల్ మన రాష్ట్ర విధానాలు గురించి రాసింది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ప్రధాని మోడీకి కూడా ఫిర్యాదు చేసాయి. అలాగే దావోస్ లో కూడా ఇదే చర్చ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వద్ద జరిగింది. ఇప్పుడు భారత దేశంలో, సోలార్ పవర్ పడిపోవటంలో, ఏపి కూడా ఒక కారణం అని అమెరికాలో ప్రముఖ వార్త పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా చెప్తుంది. ఇది చంద్రబాబు బినామీ, ఎల్లో మీడియా అని విమర్శలు చెయ్యకుండా, ప్రభుత్వం జరుగుతున్న పొరపాటు సరిదిద్దితే, రాష్ట్రానికే కాదు, దేశానికీ కూడా మంచిది. లేకపోతే, మన విధానాల వల్ల, దేశం ఇమేజ్ కూడా ఇలా అంతర్జాతీయంగా పోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read