దాదాపు 22 ఏళ్ల కిందటి నాటి ఆ రాజకీయం కేంద్రంలో ఇపుడు పునరావృతమవుతుందా?. ప్రధాని నరేంద్ర మోదీని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి ప్రధాని కానివ్వరాదని గట్టిపట్టుదలతో ఉన్న ప్రాంతీయ పక్షాలు.. 1996 నాటి ప్రయోగంపై దృష్టిపెట్టాయి. నిజానికి ఆనాడు వాజ్‌పేయి రాజకీయంగా బద్ధవిరోధులు లేరు. అలాంటి ఆయననే 13 రోజుల్లోనే గద్దె దింపేశారు. మరి మోదీ..? విపక్షాలన్నింటికీ ఆగర్భ శత్రువు. ఆయన పేరు చెబితేనే ప్రతిపక్షాలు భగ్గుమంటున్న పరిస్థితి. అందువల్లే మోదీని అసలు అధికారమే చేపట్టకుండా నిలువరించాలని భావిస్తున్నట్లు సమాచారం. నాడు యునైటెడ్‌ ఫ్రంట్‌ నిర్మాణంలో చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబే నేడు కూడా బీజేపీ-నిరోధక ప్రయత్నాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు.

delhi 1905209

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తోనూ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, ఆప్‌, లెఫ్ట్‌ చీఫ్‌తోనూ చర్చలు సాగించారు. మోదీ మళ్లీ అధికారం చేపడితే వ్యవస్థల సర్వనాశనమే కాదు, తమ అస్తిత్వమూ ప్రమాదంలో పడుతుందన్న భయాలు ఈ పార్టీల్లో ఉన్నాయి. ఈ వ్యతిరేకత కేవలం మోదీకే పరిమితం కాబోదని, బీజేపీ మొత్తానికి వర్తిస్తుందని ప్రాంతీయ పక్ష సమన్వయ వర్గాలు తెలిపాయి. అంటే మోదీ స్థానే నితిన్‌ గడ్కరీ లాంటి ఆమోదయోగ్య, సాత్విక, అనుకూలుడైన నేతను బీజేపీ ప్రతిపాదించినా ఆమోదించరాదన్న అభిప్రాయం ఈ పార్టీల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక సర్వే ప్రకారం... డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, తెలుగురాష్ట్రాల్లోని ఒకట్రెండు పార్టీలకు కలిపి ఈసారి 120 పైచిలుకు స్థానాలు లభించవచ్చు. ఇవన్నీ కలిసి కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని సర్కారు ఏర్పాటు చేయడం ఒక లక్ష్యం. కాంగ్రె్‌సకు, దాని మిత్రపక్షాలకు (యూపీఏకు) గనక 200+సీట్లు వస్తే ఇది సాధ్యపడదు. యూపీఏ గనక 160 దగ్గర ఆగిపోతే ప్రాంతీయపక్షాలదే పైచేయి కాగలదు. దీని చుట్టూనే ప్రస్తుత రాజకీయం తిరుగుతోంది.

delhi 1905209

రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మరో మాట ఏంటంటే... నరేంద్ర మోదీ వాజ్‌పేయిలాంటి వ్యక్తి కాదని! మెజారిటీ సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించి, రాష్ట్రపతి గనక తొలుత ఆయననే ఆహ్వానిస్తే ఇక ఆట పూర్తయినట్లేనని, ఒకసారి అధికారం చేపట్టాక మోదీ సులువుగా మెజారిటీ సాధించేస్తారని ఈ వర్గాలంటున్నాయి. నయానో భయానో పార్టీలను దారికి తెచ్చుకొనే సామర్థ్యం మోదీ-షాలకు ఉందని, వారు వాజ్‌పేయి మాదిరిగా విలువల చట్రం దాటనివారేం కాదని నిష్కర్షగానే అంటున్నారు. అందుకే ఆయనను ముందే నిరోధించే ప్రయత్నాలు సాగుతున్నాయని, మోదీ ఎత్తుగడలు పూర్తిగా తెలుసు గనకే పార్టీలు కూడా అప్రమత్తమవుతున్నాయని వినిపిస్తోంది. 23వ తేదీ సాయంత్రానికే ఈ ప్రయత్నాలు ఓ నిర్దిష్ట రూపు సంతరించుకోవచ్చని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read