ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్‌కు కొత్త ముఖాలను పరిచయం చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. మంత్రి మండలిలో ఈసారి జెడియు, వైఎస్సార్సీ, ఎఐఎడిఎంకెలను కూడా చేర్చాలన్న యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్లో జరిగే కేబినెట్ విస్తరణ కార్యక్రమంలో ఈ పార్టీలు సూచించిన ప్రతినిధులకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని విస్తృతంగా వినిపిస్తోంది. మూడు మిత్రపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా తమ బలం మరింతగా చాటుకోవాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుందో. అక్టోబరులోనే బీహార్ ఎన్నికలకు వెళుతోంది. పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ లో ముగుస్తాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున మోడీ కేబినెట్లో అన్ని రాష్ట్రాల ప్రస్తావన వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా రెండు గంటలపాటు ఇదే సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. ఢిల్లీ ఫలితాలు వెలువడిన రోజే ప్రధాని మోడీతో వీరిరువురూ సమావేశం నిర్వహించి బిజెపి వునఃప్రక్షాళనకు సంబంధించిన ముసాయిదా నివేదిక అందించారని చెవుతున్నారు.

సహజంగానే అనేకమంది పార్టీ సీనియర్ నాయకులను నడ్డా కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా సర్దుబాటు చేసారు. కేంద్ర పార్లమెంటరీ బోర్డును కూడా మార్చిలోనే సంప్రదించి కొన్ని మార్పు లు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇదంతా బిజెపి అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ప్రధాన మంత్రి కొత్త కేబినెట్ వైపు దృష్టిపెట్టారని తెలుస్తోంది. భారీఎత్తున కసరత్తులు ఉన్నప్పటికీ సీనియర్లను కూడా చేర్చుకోవాలన్న ప్రతిపాదన వస్తోంది. అయితే ఎవరిని బిజెపి సంస్థాగత పనులకు పంపించాలన్నది అర్థంకావడం లేదు. పాత ముఖాలు ఇప్పటికే వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే నరేంద్రమోడీ ఇప్పటికే తన టీమ్ స్థాయిని ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటివరకూ ఒక రాజకీయ వేత్తగానే నెట్టుకొచ్చారు. కొత్త ముఖాలకు చోటు కల్పించేందుకు 45 ఏళ్లలోపు ఉన్న బిజెపి ఎంపిలకు కూడా చోటు కల్పించారు.

ఇక మన విషయానికి వస్తే, రెండు రోజుల క్రితం ఆకస్మికంగా ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. మోడీ ఆయనను అమిత్ షాను కలవాలని కూడా సూచించారు. శుక్రవారం మరోసారి జగన్ న్యూఢిల్లీ వెళ్లి ఒక గంటపాటు అమిత్ షాతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి కింద వైఎస్సార్సీకి స్థానం కల్పించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీకి 22 మంది ఎంపిలు లోకసభలో ఉన్నారు. వైఎస్సార్సీ నుంచి మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డిని జగన్ ప్రతినిధులుగా పంపిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. అందుకే జగన్ మోహన్ రెడ్డి, రెండు రోజుల వ్యవధిలోనే, ఢిల్లీ వెళ్ళారని, ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read