విషయం కోర్టులో ఉన్న సరే, ఆంధ్రప్రదేశ్ లో మూడు ముక్కుల రాజధానికి అన్నిటికీ మించి వైజాగ్ వెళ్ళిపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంది. ఈ నెల 16న రాజధానుల నిర్మాణానికి శంకుస్థావన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమరావతిని వదిలేసి, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇటీవల ఈ బిల్లుతో పాటు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఆ వెంటనే రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఇప్పటికే అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, స్టేటస్ కో ఇస్తూ, మధ్యాంతర ఉత్తర్వులను ఇచ్చింది. రాష్ట్రంలో మధ్యాంతర ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఏ పరిస్థితి ఉందొ అవే వరిస్థితులుండాలని ఆదేశించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ను ప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విశాఖలో ఈ నెల 16న శంకుస్థావన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కార్య క్రమానికి ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని పాల్గొనివలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వనించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోడీ అపాయింట్మెంట్ కోరారని సమాచారం. ఈ విషయమై ప్రధాని కార్యా లయ నంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్టీ నంజయ్, ఆర్. భవసర్ కి పంపారు. సీఎంవో కార్యాలయం నుంచి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖను అనుసరించి మూడు రాజధానులకు శంకుస్థావనకు ముహర్తం ఖరారయినట్లు కథనాలు ప్రచారంలోన్నాయి. అయితే ఇప్పటికే అమరావతి శంకుస్థాపన చేసి ప్రధాని, దాన్ని తరలించుకుని పోతుంటే, మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రధాని ఏమి చేస్తారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read