టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, యనమల రామకృష్ణుడు, వైసిపి, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారం పై విరుచుకుపడ్డారు. 16 నెలలు చిప్ప కూడు తిని, కండీషనల్ బెయిల్ పై తిరిగే వాళ్ళా మమ్మల్ని అనేది అంటూ ధ్వజమెత్తారు. యనమల మాట్లాడుతూ "పిఏలు, పిఎస్ లకు, పార్టీకి సంబంధం ఏం ఉంటుంది..? పిఎస్ శ్రీనివాస్ కు టిడిపితో ఏం సంబంధం ఉంటుంది..? అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే. ఆయనపై దాడులు అతని వ్యక్తిగతం. వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమే. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పిఎస్ లు, పిఏలు పని చేశారు. మాజీ పిఎస్ పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయం. దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏంటి..? అక్రమాస్తుల కేసుల నుంచి ‘‘తాను తప్పించుకోవడం..ఎదుటివాళ్లపై దాడులు చేయడమే’’ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. టిడిపిపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా చేసింది కూడా టిడిపిపై ఫిర్యాదుల కోసమే.. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డే. వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారు. తన తరఫున పైరవీలకు, టిడిపిపై ఫిర్యాదులకే ఢిల్లీలో విజయసాయి రెడ్డిని పెట్టారు. జగన్ రూ 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరింది. రూ 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడి జప్తు చేసింది. ట్రయల్స్ కు హాజరు కాకుండా జగన్ అందుకే ఎగ్గొడుతున్నారు. శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్ ను అడ్డుకుంటున్నారు. 8ఏళ్లుగా సిబిఐ, ఈడి ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారు. కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకే. "

"హైకోర్టులో సిబిఐ పిటిషన్ కు జగన్ ముందు జవాబు ఇవ్వాలి. ఎక్కడో ఎవరో మాజీ పిఎస్ పై రెయిడ్స్ కు టిడిపికి అంటగట్టడం ఏంటి..? రివర్స్ టెండర్ కాంట్రాక్ట్ మీరిచ్చిన ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి, టిడిపికి సంబంధం ఏంటి..? తెలంగాణలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి టిడిపికి సంబంధం ఏంటి..? రెయిడ్స్ జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే కాంట్రాక్ట్ లు మీరివ్వలేదా..? 16నెలలు జైలు, 16ఛార్జిషీట్లు ఉన్న మీకా నైతిక హక్కు ఎక్కడిది..? మీ రూ 43వేల కోట్ల అవినీతి సంగతి తేల్చు ముందు..? మీ మీద ఆరోపణలు ముందు నిగ్గు తేల్చుకోండి.. ఏడాదిలో విచారణ పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. మీరెందుకు 8ఏళ్లుగా అడ్డుకుంటున్నారు..? వాయిదాలకు మినహాయింపులు ఎందుకు అడుగుతున్నారు. పదేపదే పిటిషన్లు ఎందుకు పెడుతున్నారు..? 8ఏళ్లుగా కేసులు తప్పించుకుని తిరిగేవాళ్లు టిడిపిని విమర్శించడం దారుణం. టిడిపి, వైసిపి ఏది ఎలాంటి పార్టీయో ప్రజలందరికీ తెలిసిందే. టిడిపి నిప్పులాంటి పార్టీ, నీతి నిజాయితీలున్న పార్టీ."

"తప్పుడు పనులు చేసే పార్టీ టిడిపి కాదు. సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ టిడిపి. అందుకే 40ఏళ్లుగా ప్రజల గుండెల్లో ఉంది. తప్పుడు పనుల్లో నుంచి పుట్టిన పార్టీ వైసిపి. అక్రమార్జన కాపాడుకోడానికి పెట్టిన పార్టీ వైసిపి. ఎన్నికల సంస్కరణలు రావాలి, పొలిటికల్ రిఫామ్స్ రావాలి అన్న పార్టీ టిడిపి. రూ 500, రూ 1,000 నోట్లు రద్దు చేయాలని కోరిన పార్టీ తెలుగుదేశం. గత ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీలో వైసిపి రూ 30కోట్లు ఖర్చు పెట్టిందని వాళ్ల నేతలే చెప్పారు. అధికారంలో ఉండి కూడా టిడిపి డబ్బులకు ఇబ్బందులు పడిందని అన్నారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారు. ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారు. ఏనాడన్నా జగన్ అవినీతిపై సాక్షి పత్రిక రాసిందా..? సాక్షి ఛానల్ ప్రసారం చేసిందా..? సిబిఐ, ఈడి కౌంటర్ పిటిషన్ల గురించి చెప్పిందా..? చంద్రబాబు మాజీ పిఎస్ పై దాడులకు ఇచ్చిన ప్రాధాన్యం, జగన్ ఆస్తుల ఈడి జప్తుపై ఇచ్చిందా..? జగన్ 43వేల కోట్ల అవినీతిపై సిబిఐ అఫిడవిట్ పై సాక్షి రాసిందా..? అదే సాక్షికి, ఇతర మీడియాకు ఉన్న వ్యత్యాసం..? టిడిపిపై సాక్షి మీడియా, వైసిపి నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నాం. దీనిని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటాం." అని యనమల రామకృష్ణుడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read