శాసనమండలి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు పై, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "రాజ్యాంగానికి వైసిపి నేతలు వాళ్లకిష్టం వచ్చినట్లు కొత్త భాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆర్టికల్స్, క్లాజ్ ల గురించి తమకిష్టం వచ్చిన భాష్యం చెప్పడానికి ఇది వైసిపి మేనిఫెస్టో కాదు, భారత రాజ్యాంగం. పరిపాలన సరిగ్గా చేయడం చేతకాదు. రాష్ట్రాన్నే సక్రమంగా నడపలేక పోతున్నారు. చివరికి చట్టసభలనూ కుంటుపడేలా చేస్తున్నారు. మనీ బిల్లులు, సాధారణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశ పెట్టడంపై రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 197,198లో నిర్దిష్టంగా చెప్పారు. ఆర్టికల్ 197 సాధారణ బిల్లులకు సంబంధించింది అయితే, ఆర్టికల్ 198మనీ బిల్లులకు సంబంధించినది. సాధారణ బిల్లులకు 14రోజుల నిబంధన వర్తించదు. సిఆర్ డిఏ రద్దు బిల్లు, అధికార వికేంద్రీకరణ బిల్లులు రెండూ మనీ బిల్లులు కావనే కౌన్సిల్ కు పంపేటప్పుడు స్పష్టంగా చెప్పారు. ఆ 2బిల్లులు మనీబిల్లులు కావని హైకోర్టుకు కూడా చెప్పారు. ఏజి వాదనల్లో కూడా హైకోర్టులో అవి మనీ బిల్లులు కావని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడా (నాన్ మనీ) బిల్లులకు 14రోజుల నిబంధన ఎలా వర్తిస్తుంది..? ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా వైసిపి మంత్రులు మాట్లాడుతున్నారు."

"రాజ్యాంగానికి వైసిపి నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. రాజ్యాంగంలో ప్రొవిజన్స్ అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు 14రోజుల సమస్య ఉత్పన్నం కాదు. ‘‘ఎన్ని అడ్డదారులైనా తొక్కుదాం, తమ పంతం నెరవేర్చుకుందాం’’ అన్న మూర్ఖత్వమే వైసిపి నేతల మాటల్లో కనిపిస్తోంది. ఉరిశిక్షకి, స్పీకర్ విచక్షణాధికారానికి ముడిపెట్టడమే వాళ్ల పరిజ్ఞానానికి అద్దం పడుతోంది. ఉరిశిక్ష వేసే నేరానికి పాల్పడిన వాళ్లకు అదే శిక్ష న్యాయాధికారులు వేయడంలో వింత ఏముంటుంది. అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చి వైసిపి పంతం నెరవేర్చుకోవాలని చూడటం హేయం. సభాపతి సంబంధిత చట్టసభలో తీసుకున్న నిర్ణయం యావత్ సభా నిర్ణయం..ఒకసారి ఛైర్ పర్సన్ తన నిర్ణయాన్ని ప్రకటించాక దానిని ప్రశ్నించే అధికారంగాని, మార్చే అధికారంగాని సభ్యులకే కాదు, అధికారులకు కూడా ఎవరికీ ఉండదు. "

"సభా విషయానికి వచ్చేసరికి గౌరవ స్పీకర్(ఛెయిర్ పర్సన్) సుప్రీం. ఆయన ఆదేశాలను తప్పు పట్టడం అవివేకం. ఇప్పుడీ సెలెక్ట్ కమిటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా దీనిని అడ్డుకునే కుట్రలు చేయడం, కమిటి తదుపరి ప్రక్రియ ముందుకు సాగకుండా నిరోధించడం ‘‘సభా ధిక్కారం’’ కిందకు వస్తాయి. ఇలాంటి అంశంపై గతంలో ఇచ్చిన అనేక రూలింగ్స్ మన ముందే ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ చేస్తున్న ‘‘కుట్రలు’’ స్పష్టంగా కళ్లెదుటే ఉన్నాయి. ఏ విధంగా రాజ్యాంగ మార్గదర్శకాలను ఉల్లంఘించి, పార్లమెంటరీ ప్రొసీజర్, ప్రాక్టీసెస్ అతిక్రమించి వ్యవహరిస్తున్నారో కనబడుతోంది. ఇటువంటి ‘‘కుట్రలు’’ సభా ధిక్కారం కిందకు వస్తాయి. సభా ప్రొసీడింగ్స్ కు వ్యతిరేకంగా ఏ అధికారి వ్యవహరించరాదు. ఎవరైనా అలా వ్యవహరిస్తే అది నేరం, ప్రివిలేజ్ నిబంధనలను ఉల్లంఘించడమే. దానిపై సదరు గౌరవ సభ తగిన చర్యలు చేపట్టే అధికారం ఉంది." అంటూ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read