గత సార్వత్రిక ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో, ఎవరికి వారే పోటీ చేసారు. ప్రధాన పార్టీలు ఏవి కలిసి పోటీ చెయ్యలేదు. 2014లో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి, సక్సెస్ అయ్యాయి. 2019 వచ్చే సరికి, అన్ని పార్టీలదీ ఒకే ఎజండా, అదే చంద్రబాబుని గద్దె దింపటం. అందుకే, లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని, ఎవరికి వారు విడిగా పోటీ చేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వైసీపీ, బీజీపీకి మధ్య, ఒప్పందం ఉంది అనేది, బహిరంగ రహస్యమే. ఎన్నికల వేళ, టిడిపి నేతల పైనే ఐటి దాడులు జరగటం, వైసీపీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, అలాగే వైసీపీ చెప్పిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించటం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా, బీజేపీ, వైసీపీకి సహాయం చేసింది. ఇక పక్క రాష్ట్రం కేసీఆర్ కూడా, ఒక చెయ్య వేసారు. నిజానకి ఇదే పెద్ద చెయ్య అని, ఆర్ధికంగా సపోర్ట్ చేసిన చెయ్య అని, రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వస్తున్న వార్త. ఇక జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేసినా, వారి ప్రభావం అంత అంత మాత్రమే అయినా, 7 శాతం వరకు ఓట్లు చీల్చారు.

vsreddy 16012020 2

ఇలా ఎన్నికల ముందు వరకు, ప్రతి రాజకీయ పార్టీ, టిడిపిని ఓడించి, వైసీపీ గద్దెనేక్కించటానికి వ్యూహాలు పన్నాయి. వాళ్ళు అనుకుంది సాధించారు. అయితే, అప్పటి నుంచి రాష్ట్రం, వెనక్కు వెళ్ళటం ప్రారంభం అయ్యింది. దీంతో అప్పటి వరకు స్నేహంగా ఉన్న బీజేపీ, రివర్స్ అవ్వటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఏపిలో బలం పుంజుకోవటానికి, వ్యూహాలు పన్నుతుంది. ఇందులో భాగంగానే, జనసేనతో కలిసి ఇక ముందుకు సాగటానికి బీజేపీ డిసైడ్ అయ్యింది. ఈ రోజు బీజేపీ, జనసేన కలిసి, ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. అయితే, ఇప్పుడు జనసేన, బీజేపీ, కలిసి ముందుకు వెళ్తూ ఉండటంతో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వాతావరనం ఉంటుందో, అనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

vsreddy 16012020 3

వీరి ఇరువరి కలయిక, ఎవరికి లాభం ? ఎవరికి నష్టం అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా మొన్నటి దాక, జగన్, విజయసాయి రెడ్డికి, ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం దగ్గర వెయిట్ ఉండేది. అది రాను రాను తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు జనసేన దగ్గర అయితే, ఇక జగన్, విజయసాయి రెడ్డిని, బీజేపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టే అవకాసం ఉంటుంది. ముఖ్యంగా, విజయసాయి రెడ్డి, ఢిల్లీ స్థాయిలో జరిపే లాబీలకు, ఇక ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ పై దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా దూకుడుగా తమ పై విమర్శలు చేస్తే, వాటిని తిప్పి కొట్టాలా ? సైలెంట్ గా ఉండాలా అనే కన్ఫ్యూషన్ లో వైసీపీ ఉంది. మారిన రాజకీయ పరిస్థితితుల్లో, బీజేపీ పై, జగన్, విజయసాయి రెడ్డి, వైఖరి ఎలా ఉంటుందో చూడాలి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read