ఐటి శాఖ పంచనామాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి, వేడి వాతారణాన్ని సృష్టిస్తుంది. ఇటీవల ఐటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దాడులు నిర్వహించింది. దీంతో పాటు దేశంలో వివిధ చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి వివిధ ప్రాంతాలో ఆర్థిక లావాదేవీలు డొల్ల కంపెనీల పేరిట సాగినట్లు గుర్తించినట్లు ఐటి శాఖ అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. తాము దాడులు జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిలో, మూడు ఇన్ఫ్రా కంపెనీలు, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఉన్నట్లుగా వెల్లడించింది. దీంతో అధికార వైకాంగ్రెస్ నాయకులు, ఆ మూడు కంపెనీలు అనేది వదిలేసి, కేవలం చంద్రబాబు పీఎస్ అని పట్టుకుని, తెలుగుదేశం నేతల పై విష ప్రచారం చేసారు. 2 వేల కోట్లు చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే దొరికాయి అంటూ, తప్పుడు ప్రచారం చేసారు. ఈ క్రమంలో వారి ఆరోపణలు అభూత కల్పనలని చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కేవలం రూ.2.63 లక్షలు నగదు, 12 తులాల బంగారం గుర్తించి వదిలేసారంటూ, ఐటి శాఖ పంచనామా నివేదిక బయట పడింది.

అది ఐటి శాఖ విడుదల చేసిన పంచనామా కావటంతో, వైసీపీకి ఒక రోజు సౌండ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తామంటూ తెలుగుదేశం నాయకులు బొండా ఉమా, బుచ్చయ్యచౌదరి.యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమాలు అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అధికార పార్టీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాద్, అనిల్‌కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలినాని తప్పుడు ప్రచారం చేసారని, అక్కడ జరిగింది 3 ఇన్ఫ్రా కంపెనీల మీద అయితే, చంద్రబాబు మీద అంటూ తప్పుడు ప్రచారం చేసారని అన్నారు. అయితే పెండ్యాల శ్రీనివాసు ఐటి పంపిన పంచనామాతో టిడిపి ఎదురు దాడి చెయ్యటంతో, వైసీపీకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, తాము ప్రజల్లో చులకన అవుతామని గ్రహించి, మరో డ్రామాతో ముందుకు వచ్చింది.

కడపలో ఎవరో ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ మీద జరిగిన ఐటి దాడుల పంచనామా రిపోర్ట్ చూపించి, ఇది శ్రీనివాస్ పంచనామా రిపోర్ట్ అని, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. వేల డాక్యుమెంట్లు సీజ్ చేసారని, ఇక చంద్రబాబు పని అయిపొయింది అంటూ, మరో ప్రచారానికి తెర లేపింది. అయితే అందులో కూడా డబ్బు, నగలు తరిగి ఇచ్చేసినట్టు ఉంది. ఎక్కడా రెండు వేల కోట్లు అనే విషయం లేదు. సహజంగా కంపెనీల మీద దాడి చేసిన సమయంలో, కొన్ని డాక్యుమెంట్ లు సీజ్ చేస్తారు. అవి అన్నీ వెరిఫై చేసుకుని వదిలి పెడతారు. అయినా, ఈ ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ కు, చంద్రబాబుకి ఏమి సంబంధం అని, ముందు ఆ రెండు వేల కోట్లు విషయం తేల్చిండి అంటూ టిడిపి అడిగిన ప్రశ్నకు, ఒక అబద్ధానికి, పది అబద్ధాలు ఆడి, అదే నిజం అని నమ్మించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడుతుంది వైసీపీ. అయినా రెండు వేల కోట్లు చంద్రబాబు వద్ద దొరికితే, ప్రాధాన్ మోడీ, హోం మంత్రి అమిత్ షా చూస్తూ కూర్చుంటారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read