ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎక్కడా లేని వింత పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు, స్కూల్స్, పంచాయతీ ఆఫీసులు అంటే, ఆ ఊరిలో ప్రజలందరూ, అక్కడకు వెళ్లి పనులు చేసుకుంటారు. అంతే కాని, ఏదో ఒక పార్టీ వారే అక్కడకు వెళ్లారు. అయితే, 2019 జూన్ లో , జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు, వైసీపీ జెండా రంగులు పోలిన, రంగులు వెయ్యాలి అంటూ, ఆదేశాలు వచ్చాయి. ఇక ఆదేశాలు వచ్చిందే తరువు, ప్రభుత్వాధినేతల ద్రుష్టిలో పడటానీకో, లేక నిజంగానే ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందో కాని, ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం, వైసీపీ రంగులతో నింపటం మొదలు పెట్టారు. పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగులు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, వాటర్ ట్యాంకులకు వైసీపీ రంగులు, ప్రభుత్వ స్కూల్స్ కి వైసీపీ రంగులు, ఆకులకు వైసీపీ రంగులు, కరంటు స్థంబాలకు వైసీపీ రంగులు, గేద కొమ్ములకు వైసీపీ రంగులు, ఇలా కనిపించిన ప్రతి దానికి, వైసీపీ రంగులతో మొత్తం నింపేశారు.

చివరకు ఒక చోట, జాతీయ జెండా రంగులు కూడా మార్చేసి, వైసీపీ రంగులు పుసేసారు. సహజంగా, ఇవి చూస్తే ఎవరికైనా విరక్తి పుడుతుంది. ఇలా విరక్తి పుట్టే, ఒకరు హైకోర్ట్ కు వెళ్లారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, 1300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ రంగులు వేసారని ఆరోపించింది. అయితే ఈ విషయం హైకోర్ట్ కు చేరటంతో, హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో, అది వైసీపీ రంగు కాదని, ప్రభుత్వ తరుపు లాయర్ చెప్పటంతో, వైసీపీ జెండా కోర్ట్ కు తీసుకురండి, అని కూడా చెప్పింది. ఆ రంగులు ఏంటి, ప్రభుత్వ భవనాల ముందు, ఆ ఫోటో ఏమిటి, మేము కూడా సుప్రీం కోర్ట్ బయట, చీఫ్ జస్టిస్ ఫోటో పెట్టుకోమా అంటూ, ప్రశ్నించింది. చివరకు, హైకోర్ట్ తీవ్రంగా స్పందిస్తూ, 10 రోజుల్లోగా, రాష్ట్రంలో రంగులు అన్నీ మార్చాలని ఆదేశించింది.

బాధ్యతను చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పింది. అయితే, అనూహ్యంగా, ప్రభుత్వం ఈ విషయం పై కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. సహజంగానే, సుప్రీం కోర్ట్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. దీంతో, ఇక చేసేది లేక, ఇప్పుడు ప్రభుత్వం, మళ్ళీ రంగుల పంచాయతీ మొదలు పెట్టింది. హైకోర్ట్ చెప్పినట్టు, రంగుల మార్చాలి కాబట్టి, ఏ రంగులు వెయ్యాలి అనే విషయం పై, ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారం రోజులల్లో, ఏ రంగులు వెయ్యాలో, నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వానికి సూచించాలని వారిని కోరింది. ఈ కమిటీలో భూపరిపాలనాశాఖ కమిషనర్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శిని సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రంగుల పంచాయతీ మొదలు కావటంతో, మళ్ళీ ఎన్ని వందల కోట్లు నష్టపోతామా అని, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read