రాజకీయాల్లో ఒక వ్యక్తీ క్యారక్టర్ ను చంపేస్తే, మానం, అభిమానం ఉన్న వ్యక్తులు, అవి ఎదుర్కోలేక, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే వికృత క్రీడ మన రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాగే కోడెల లాంటి నాయకుడుని, టిడిపి కోల్పోయింది. ఇప్పుడు ఇదే రకమైన ప్రచారం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై చేస్తున్నారు. లోకేష్ పై అనేక అవినీతి ఆరోపణలు చేసి, ఏది నిరూపించలేక, వైసిపీ ఎన్ని పాట్లు పడుతుందో చూసాం. అందుకే ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తే మాటల్లో జరిగిన తప్పులు ఎత్తి చూపుతూ, సంతోష పడుతూ ఉంటారు. అవినీతి ఎలాగూ నిరూపించలేం అని తెలుసుకున్న వైసీపీ, ఇప్పుడు లోకేష్ చిరుతిండి ఖర్చు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. లోకేష్ మంత్రి అయిన తరువాత, కేవలం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోని ఒక రెస్టారెంట్ లో, 25 లక్షల ఖర్చు చేసే, చిరుతిండి తిన్నారు అంటూ వైసీపీ తన సొంత మీడియాలో వేసుకోవటం, అది పట్టుకుని, మరి కొన్ని అనుకూల మీడియాలో కధనాలు రావటం, వైసిపీ దాన్ని ప్రచారం చెయ్యటం జరుగుతుంది.

lokesh 23102019 2

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ రెస్టారంట్ లో, ప్రోటోకాల్ ప్రకారం, సియం, కేంద్ర/రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అతిధులు, ప్రతిపక్ష నేత, ఎంపీలు, ఇలా అనేక మందికి ప్రోటోకాల్ ప్రకారం, ఆ ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ లో, రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆతిధ్యం ఇస్తారని, అందరి ఖర్చు, లోకేష్ ఖర్చు గా చూపిస్తున్నారని టిడిపి అంటుంది. అసలు ఇంకో విషయం ఏమిటి అంటే, వైసిపీ ప్రచారం చేస్తున్న ఆ తేదీలిలో, అసలు లోకేష్ వైజాగ్ లోనే లేరని, ఆయన అమరావతిలో, హైదరబాద్ లో, అమెరికాలో , ఢిల్లీలో ఇలా వివిధ చోట్ల ఉన్నారని, ఆధారాలు చూపిస్తి, ఈ వికృత ప్రచారాన్ని టిడిపి ఖండించింది. అసలు లోకేష్ వైజాగ్ లోనే లేకపోతే, ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో, పూర్తీ ఆధారాలతో, కేసు వేయటానికి, లోకేష్ సిద్ధమయ్యారు.

lokesh 23102019 3

ఇది టిడిపి విడుదల చేసిన వివరాలు...15-08-2017 - సాక్షి రాసింది: 83,816 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, సుజనా చౌదరి కూతురు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 31-10-2017 - సాక్షి రాసింది: 79,166 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో, సియం, ఇతర అధికారులతో; 18-11-2017 - సాక్షి రాసింది: 31,322 రూపాయల బిల్ చేసారని,లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉన్నారు: ఈ ఒక్క రోజు మాత్రమే విశాఖపట్నంలో, ఆగ్రీ టెక్ సమ్మిట్ లో; 20-11-2017 - సాక్షి రాసింది: 59,818 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం పై ప్రసంగం; 05-12-2017 - సాక్షి రాసింది: 21,098 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 05-12-2017 - సాక్షి రాసింది: 10,466 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రివ్యూ; 31-12-2017 - సాక్షి రాసింది: 45,234 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఉండవల్లి నివాసంలో; 04-02-2018 - సాక్షి రాసింది: 67,096 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: అమెరికాలోని న్యూజర్సీలో, ఎన్ఆర్ఐ టిడిపి శ్రేణుల మధ్య మాట్లాడుతూ; 28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ;

lokesh 23102019 4

28-02-2018 - సాక్షి రాసింది: 64,890 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, రూరల్ వాటర్ సప్లై పై రివ్యూ; 30-04-2018 - సాక్షి రాసింది: 47,040 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-05-2018 - సాక్షి రాసింది: 48,878 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, నిరుద్యోగ బృతి ప్రకటన; 30-06-2018 - సాక్షి రాసింది: 44,122 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: కడపలో జరిగిన, సియం రమేష్ ఉక్కు దీక్షలో ప్రసంగం; 31-07-2018 - సాక్షి రాసింది: 56,742 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ లో, stanford పూర్వ విద్యార్ధుల కలియికలో ; 26-08-2018 - సాక్షి రాసింది: 74,392 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: హైదరాబాద్ నివాసంలో.; 30-09-2018 - సాక్షి రాసింది: 63,452 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: వెలగపూడి సచివాలయంలో, యువనేస్తం పై రివ్యూ; 30-10-2018 - సాక్షి రాసింది: 79,170 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ప్రసంగం; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 31-01-2019 - సాక్షి రాసింది: 14,322 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తోమార్ గారితో భేటీ ; 20-03-2019 - సాక్షి రాసింది: 3,928 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: తాడేపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 31-03-2019 - సాక్షి రాసింది: 7,246 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: మంగళగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో; 30-04-2019 - సాక్షి రాసింది: 3,108 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఎన్నికలు అయిపోయాయి, హైదరాబాద్ నివాసంలో; 31-05-2019 - సాక్షి రాసింది: 10,396 రూపాయల బిల్ చేసారని, లోకేష్ ఎక్కడ ఉన్నారు: ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read