ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్ర బీజేపీ నాయకత్వ మార్పు, వైసిపీ పార్టీకి ఎక్కడ లేని సంతోషాన్ని తెచ్చి పెట్టింది. సోము వీర్రాజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించగానే, అదేదో తమ పార్టీలో జరిగిన సంబరంలో, వైసిపీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలు దాకా, చివరకు ట్విట్టర్ లో ఉండే కొంత మంది ప్రభుత్వ సలదారులు కూడా సంబరాలు చేసుకున్నారు. బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తే, వైసిపీ నేతలు చేసుకుంటున్న సంబరం చూసిన వారికి వీళ్ళ సంబంధాల పై క్లారిటీ వచ్చింది. సోము వీర్రాజుకి బీజేపీ పగ్గాలు అప్ప చెప్పటంతో, తమకు సానుకూలం అనే అభిప్రయాన్ని వైసిపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కమల దళంతో ఇక మా స్నేహానికి ఎదురు లేదని, కేంద్రంలో తమ పై ఫిర్యాదు ఇచ్చే వారే ఉండరని, సంబర పడుతుంది వైసిపీ. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో, తమకు అనుకూలంగా ఉండే సోము వీర్రాజు రావటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు.

సోము వీర్రాజు మార్పుతో, తమ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని, వైసిపీ అంచనా వేస్తుంది. దీనికి ప్రధాన కారణం, కన్నా లక్ష్మీనారాయణ, వైసిపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపటమే. కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్ల స్కాం గురించి, 108 స్కాం గురించి బయట పెట్టటంతోనే పెద్దవి అయ్యాయి. తెలుగుదేశం పార్టీ పై అంటే విరుచుకు పడవచ్చు కాని, బీజేపీ పై విరుచుకు పడితే హైకమాండ్ ఊరుకోదు. దీంతో, వైసిపీ చాలా ఇబ్బంది పాడేది, కన్నా లేవనెత్తిన అంశాలు వైసీపీకి చాలా ఇబ్బందిగా మారుతూ వచ్చింది. కన్నా లక్ష్మీ నారయణ లేవనెత్తే అంశాలు ప్రజల్లోకి కూడా వెళ్ళేవి. దీంతో ఇప్పుడు కన్నాని తప్పించటంతో, ఊపిరి పీల్చుకుంది వైసిపీ. తమకు అనుకూలంగా ఉండే సోము వీర్రాజు రావటం, సోము వీర్రాజు తమకంటే చంద్రబాబునే ఎక్కువ టార్గెట్ చేసే వారు కావటంతో, తమ పని ఇంకా తేలిక అని, కేంద్రంలో ఎలా ఉన్నా, రాష్ట్రంలో బీజేపీతో కలిసి, తెలుగుదేశం పార్టీని మరింత టార్గెట్ చెయ్యవచ్చు అని వైసిపీ భావిస్తుంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read