నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ గగిలింది. 90 శాతం గెలుచుకుంటాం అని చెప్పిన వైసిపీ నేతలు, బొక్క బోర్లా పడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటా పోటీగా సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కంచుకోతలను కూడా టిడిపి బద్దలు కొడుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తమ సొంత గ్రామంలో ఓడిపోతున్నారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సొంత గ్రామం అయిన, రాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ టిడిపికి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడి సాధించారు. చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక మంత్రి విశ్వరూప్ సొంత ఊరిలో తెలుగుదేశం బలపరించిన అభ్యర్ధి గెలిచారు. అలాగే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంత వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇది పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీలో ఉంది. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి సొంత గ్రామం, తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపీ ఓడిపోయింది. అలాగే కొంత మంది వైసిపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read