రెండు రోజుల క్రితం, కడప జిల్లాలోని మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో దాదాపుగా పది మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో అనూహ్యంగా ఒక కీలక వ్యక్తని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న అయిన ప్రతాప్‌రెడ్డి. వైఎస్ కుటుంబానికి చెందిన ప్రతాప్ రెడ్డి ఈ కేసులో అడ్డంగా దొరికిపోవటంతో, తప్పించుకునే అవకాసం దక్క లేదు. దీంతో, ఆయన్ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న , వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి, పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈయన అరెస్ట్ కు ప్రధాన కారణం, జిలెటన్‌ స్టిక్స్‌ సప్లయ్ చేయటం. మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఉపయోగించిన, జిలెటన్‌ స్టిక్స్‌ ని పులివెందుల నుంచి, వైఎస్ ప్రాతప్ రెడ్డి తీసుకుని వెళ్లినట్టు, ఆధారాలు దొరకటంతో, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయక తప్ప లేదు. వైఎస్ ప్రతాప్ రెడ్డికి పులివెందులలో మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి, ముగ్గురాళ్ల గనికి జిలెటన్‌ స్టిక్స్‌ ని తరలించారు. ఈ జిలెటన్‌ స్టిక్స్‌ తరలించే సమయంలో నిబంధనలు తుంగలోకి తొక్కి, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టలేదు.

blast 11052021 2

చివరకు పది మంది చనిపోవటానికి కారణం అయ్యారు. ఈ అభియోగంతోనే, ఆయన్ను అరెస్ట్ చేసారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, పెదనాన్న అయిన వైఎస్ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయటంతో, ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైఎస్ ప్రతాప రెడ్డికి, కడపలోని అనేక ప్రాంతాల్లో గనులు ఉన్నాయని. అక్కడ ఉపయోగించే జిలెటన్‌ స్టిక్స్‌ను, ఆయనకు ఉన్న మ్యాగజైన్‌ లైసెన్స్‌ ఉపయోగించి, ఈ జిలెటన్‌ స్టిక్స్‌ను మామిళ్లపల్లె గనులకు తరలించారు. అయితే ఈ క్రమంలోనే, అక్కడ సరైన ఏర్పాట్లు చేయక పోవటం, ఇష్టం వచ్చినట్టు అన్ లోడ్ చేసే క్రమంలో, పెద్ద పే-లు-డు సంభవించింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కూలీలు పది మందికి పైగా చనిపోయారు. ఇక్కడ గని యజమాని అయిన నాగేశ్వర్‌రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా, పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వార్త అవ్వటం, ప్రతిపక్షాలు ఆందోళన చేయటంతో, అరెస్ట్ చేయక తప్పలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read