మాజీ మంత్రి, జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వి-వే-క హ-త్య కేసు పై, తమకు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇక్కడ పోలీసుల పై నమ్మకం లేదని, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, సాక్షాత్తు జగన్ సోదరి అయిన, వైఎస్ వి-వే-క కూతురు, సునీత హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్, ఇక వాదనలు ముగిసినట్టు ప్రకటించి, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ రోజు హైకోర్ట్ ఆదేశాలు మేరకు, పోలీసులు, శ-వ-ప-రీ-క్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని, పోలీసులు హైకోర్ట్ కు సమర్పించారు. కేసుకు సంబంధించి, ఇప్పటి వరకు వారి దగ్గర ఉన్న అన్ని విషయాలను కూడా పోలీసులు కోర్ట్ కు సమర్పించారు. గతంలోనే కోర్ట్, తమకు శ-వ-ప-రీ-క్ష నివేదిక, జనరల్‌ కేసు డైరీని, అన్ని వివరాలను సమర్పించాలని, ఇది వరకు కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలోనే, పోలీసులు ఈ రోజు అన్నీ సమర్పించారు. మరో పక్క ఈ రోజు చివరి సారిగా, ఇరు పక్షాలు, బలంగా హైకోర్ట్ ముందు తమ వాదనలు వినిపించాయి.

viveka 24022020 2

అయితే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఉన్నట్టు ఉండి ఆయన పిటీషన్ వెనక్కు తీసుకుంటూ, దానికి కారణాలు చెప్తూ మెమో దాఖలు చేసారు. అయితే ఈ మెమో పై, వి-వే-క కూతురు తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే ఈ నేపధ్యంలో తాము ఎందుకు పిటీషన్ వెనక్కు తీసుకువాలి అని నిర్ణయం తీసుకున్న విషయం పై కూడా, జగన్ మోహన్ రెడ్డి, తరుపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి, వి-వే-క కూతురు తరుపు నయ్యవాది మాత్రం, తీవ్ర అభ్యంతరం చెప్పారు. గతంలో ఒక హకూతురుత్య కేసుకు సంబంధించి, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐకి ఇవ్వాలి అంటూ నిర్ణయం తీసుకున్నారని కోర్ట్ కు చెప్పారు.

viveka 24022020 3

అదే విధంగా వివేక కేసుని కూడా సిబిఐకి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ వేసారని, ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారని, అభ్యంతరం చెప్పారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న, హైకోర్ట్, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. దీని పై త్వరలోనే తీర్పు రానుంది. అయితే ఈ పిటీషన్ పై గత నెల రోజులగా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడిచాయి. వి-వే-క కూతురు వేసిన పిటీషన్ లో, వైసీపీ ఎంపీల పేర్లు, వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళ పేర్లు ఉండటంతో, ఒక్కసారి సంచలనంగా మారింది. మొన్న జరిగిన విచారణలో, దాదపుగా అయుదుగురు వైసీపీ ముఖ్య నాయకులు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు, తమకు అనుమానాలు ఉన్నాయి అంటూ, పిటీషన్ తరుపు న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read