తిరుమల శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను ఇకపై మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసంTTD ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేవలం TTD వెబ్ సైట్ లో మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కాని, ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని ఏటీపీ కేంద్రాల్లో శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నామని TTD ఈవో సాంబశివరావు పేర్కొన్నారు.

తక్కువ చార్జీతో రూ.300 టిక్కెట్ ను బుక్ చేసుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు  ఏటీపీ సెంటర్లు ఉన్నాయని, వీటితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం వారికి శాఖలు ఉన్నాయన్నారు. ఆయా  ఏటీపీ సెంటర్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్న సాంబశివరావు, ప్రైవేటు ఇంటర్నెట్ నిర్వాహకులు భక్తుల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read