కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ బేగంపేటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు, ఇటీవలే యశోదా ఆస్పత్రిలో చికిత్సి పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బేగంపేటలోని నివాసంలో ఉంటూ వైద్యం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావును కలిశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Advertisements