దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఒక మూలస్థంభాన్ని కోల్పోయిందన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లిన దాసరి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని చెప్పారు.

నాతో చాలా ఆత్మీయంగా మాట్లాడేవారని, ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవించేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రెండు నెలల క్రితం, హాస్పిటల్ లో చికిత్స జరుగుతున్నప్పుడు వెళ్లి కలిసానని, గుర్తుచేసుకున్నారు.

దర్శక రత్న దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read