అమరావతి ప్రాంతంలో భూముల అమ్మకాలపై క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు చేయించినందుకు అభినందనలు
నాపై విశ్వాసంతో భూములిచ్చారు: చంద్రబాబు
అమరావతి పరిధిలో క్యాపిటల్ గెయిన్స్రకు మిహాయింపునిస్తూ కేంద్రం బడ్జెట్ లో ప్రకటన
రాజధాని ‘అమరావతి’ కోసం భూములిచ్చిన రైతుల కలలు నెరవేర్చిన చంద్రబాబు
అమరావతి రైతులు పెద్దెత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూముల అమ్మకాలపై క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు చేయించినందుకు రైతులు ప్రశంసించారు. పూలబొక్కేలు, శాలువాలతో చంద్రబాబును అభినందించారు. అమరావతి ప్రాంత వాసులకు బంగారు భవిష్యతును ప్రసాధించారని పేర్కొన్నారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
నాపై విశ్వాసంతో భూములిచ్చారు: చంద్రబాబు
`` నా పిలుపు మేరకు రైతులు భూసమీకరణలో భూములిచ్చారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు నాపై విశ్వాసంతో భూములిచ్చారు. రాజధాని రైతులకు మూలధన లాభంలో పన్ను మినహాయింపు ఇచ్చారు. ప్రధాని, ఆర్ధిక మంత్రులకు ధన్యవాదాలు. దీర్ఘకాలంలో ప్రయోజనం కలిపించే అంశాలు బడ్జెట్లో చాలా ఉన్నాయి.
రాజధానైకి రూ. 2500 కోట్లు ఇస్తామన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు. కొన్నియు పార్టీలు నిధుల కోసమే ఉన్నాయి.. సేవ చేయడానికి రాజకీయ పార్టీలు ఉండాలి..డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ కోసం సిఫార్సులు చేసాం. చెల్లింపుల నియంత్రణ బోర్డు ఏర్పాటు చేసాం. . '' ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు