వైసీపీ అధినేత జగన్‌ పై మరోసారి ఈడీ కొరడా ఝళిపించింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. జగన్‌కు చెందిన సూట్‌కేస్‌ కంపెనీల్లో తనిఖీలు చేసింది. ముంబైలో ఒకే అడ్రస్‌తో 700 సూట్‌కేస్‌ కంపెనీలను గుర్తించింది. అలాగే 20 మంది డమ్మీ డైరెక్టర్లుని కూడా గుర్తించింది.

జగన్ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్టు అనే కంపెనీకి డబ్బు వెళ్లినట్టు ఈడీ గుర్తించింది. రాజెశ్వర్ ఎక్స్‌పోర్టు ద్వారా నోట్ల రద్దు టైంలో 1478 కోట్లు హంకాంగ్ మల్లించినట్టు ఈడీ గుర్తించింది. సూట్‌కేస్‌ కంపెనీలతో జగన్‎కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది. త్వరలో ఈ విషయంలో కూడా, జగన్ కు సమన్లు ఇచ్చే అవకాసం ఉంది. ఈ విషయం పై, ఈడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇప్పటికే ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జగన్ కు సంబంధించిన వేలాది కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే... జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం కూడా తెలిసిందే..

jagan 14042017 1

Advertisements

Advertisements

Latest Articles

Most Read