అవును మీరు వింటున్నది నిజం... ఏంటి రా నిజం, ఎకరం 15 కోట్లు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా, ఎంత జరీబు భూమి అయినా మహా అయితే 3-4 కోట్లు అంటారా... కాని మన ప్రతిపక్ష నాయకుడు, చెప్తున్నారు, రాజధాని గ్రామాల్లో ఎకరం 15 కోట్లు పలుకుతుంది అని. మీరు ఇంకో రెండేళ్ళు కాపాడుకోండి, తర్వాత నేనే సియం, మీ భూములు మీకు ఇచ్చేస్తా, ఎకరా 15 కోట్లు ఖరీదు చేసే భూమి నేను ఏర్పాటు చేసే ప్రభుత్వం తీసుకోదు అంటున్నారు, మన ప్రియతమ ప్రతిపక్ష నేత...

దీంతో ఈ మాట, ఆ నోట ఈ నోటా, పాకి, అమరావతి రాజధానిలోని అన్ని గ్రామాలకు పాకింది. ఇంకేముంది, రైతులు, స్పెషల్ బస్సులు వేసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు ఉండే, తెలంగాణా రాష్ట్రానికి బయలుదేరారు... అక్కడ లోటస్ పాండ్ లో, రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిసారు అని, ఎకరాకు 15 కోట్లు వస్తాయి అని, ఆశతో పరుగులు పెడుతున్నారు. ఇక చంద్రబాబుకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటామని, మాకు అమరావతి కంటే, లోటస్ పాండ్ మీద నమ్మకం ఎక్కువ అని, మా జీవితాలు మా యువ నాయకుడు మార్చేస్తాడు అని, సంబరాలు చేసుకుంటున్నారు...

మీరు ఏమి, అలా వెర్రి మాటలు నమ్మరని తెలుసు... ఇది నిజం అని నమ్మి వెళ్ళేరు... ఉన్నది కూడా ఉడ్చుకుపోయే చరిత్ర వాళ్ళది...

33 వేల ఎకరాలు, రాష్ట్ర భవిషత్తు కోసం, త్యాగం చేసిన రైతులని పట్టించుకోకుండా, భూములు ఇవ్వని 1300 ఎకరాలు కోసం, ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న పోరాటంలో, చెప్తున్న అబద్ధాలు ఇవి.. ఎంత ఆత్రంగా ఉన్నారు అంటే, ఎలా అయినా, ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా సరే, ప్రశాంత వాతావరణం చెడగొట్టాలి, రైతులని రేచ్చగొట్టాలి, అమరావతిని ఆపాలి అనే అజెండాతో, ఉన్న వాళ్ళు, ఇంతకంటే ఏమి దిగాజారగలరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read