దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో కూడిన అడ్వాన్సు లైఫ్ సపోర్టు(ఎఎల్ఎస్) అంబులెన్సును సీఎం చంద్రబాబునాయుడు గురువారం వెలగపూడిలోని తాత్కా లిక సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 13 జిల్లాలకు అత్యా ధునిక సాంకేతిక టెక్నాలజీతో కూడిన 76 అడ్వాన్సు లైఫ్ సపోర్టు(ఎఎల్ఎస్) అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఒక్కొక్క అంబులెన్స్ ఖరీదు రూ.32లక్షలగా పేర్కొన్నారు. ఈ అంబులెన్స్లలో 38 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి కామినేని వివరించారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రతి లక్ష మందికి ఒకటి చొప్పన 450 అంబులెన్స్లు ఉన్నట్లు తెలిపారు. వీటిని ఆధునీకరిస్తూ ప్రతి 5 లక్షల జనాభాకు ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ అంబులెన్సులో టెలీమెడిసిన్ ద్వారా రోగికి ప్రత్యేక వైద్యసహాయం అందించే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి కామినేని వెల్లడిం చారు. త్వరలో ఈ ఎఎల్ఎస్ అంబులెన్స్లలో టెలీ మెడిసిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఎంపి నిధుల నుంచి రాష్ట్రానికి మరో 13 ఎఎల్ఎస్ అంబులెన్సులు రానున్నట్లు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read