తెలుగునాట తన నట వైభవంతోను.. రాజకీయ ప్రాశస్త్యంతోను ఇక్కడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినవారు నందమూరి తారకరామరావు. ఆయన సినీ జీవిత విశేషాలను, రాజకీయ గమనాన్ని ప్రతిబింబించేలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పుడో బృహత్ కార్యాన్ని చేపట్టబోతుంది. ప్రపంచ అగ్రశ్రేణి మ్యూజియంలకు ఏమాత్రం తీసిపోకుండా.. వీలైతే వాటిని మించి ఉండేలా.. ఎన్టీఆర్ మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సన్నద్దమవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియంలను అధ్యయనం చేశాక, ఒక్క మ్యూజియంగా కంటే మ్యూజియం-గ్రంథాల‌యంగా తీర్చిదిద్దాల‌ని భావించారు. ఈ ఏడాదిలోనే మ్యూజియంకు శంకుస్థాప‌న చేసి మూడేళ్ల‌లో పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం పదెకరాల స్థలంలో ఏర్పాటుచేస్తారు. స్థల ఎంపిక చేపట్టాల్సి ఉంది.

    • ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజకీయ రంగాలు, ఇతర అంశాలపై వేర్వేరు గ్యాలరీలుంటాయి.
  • ఎన్టీఆర్ గురించి ప్రభావంతంగా వివరించేందుకు ఫోటోలు, చిత్రాలు, రాతి శిల్పాలు, త్రీడీ బొమ్మలు ఏర్పాటుచేస్తారు
  • వివిధ భాషల్లో ఆడియో, వీడియో ప్రదర్శనలుంటాయి
  • కనీసం రెండు వేల మంది కూర్చునేంత ఆడిటోరియం నిర్మిస్తారు
  • క‌నీసం రెండువేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం నిర్మించనున్నారు
  • ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుచేస్తారు
Advertisements

Advertisements

Latest Articles

Most Read