ప్రభుత్వం వసూలు చేసే వివిధ పన్నుల నుండి ఆంధ్రప్రదేశ్ కు 29,138.82 కోట్లు లభించాయి. గత ఏడాది కేంద్రం పన్నుల నుండి ఏ.పీకి లభించిన పన్నుల వాటాతో పోలిస్తే ఇది 2,874.94 కోట్ల అధికం. కేంద్రం మొత్తం పన్నుల్లో రాష్ట్రానికి 4.305 శాతం వాటా లభిస్తుంది. కార్పోరేషన్ పన్ను వాటా కింద 8,538.74 కోట్ల ఆదాయం, పన్ను వాటా కింద 7,504.42 కోట్ల, ఆస్తి పన్ను వాటా కింద 0.27 కోట్లు, కస్టమ్స్ పన్నుల వాటా కింద 4,096.97 కోట్ల, కేంద్ర ఎక్సైజ్ పన్నుల వాటా కింద 4,282.50 కోట్లు, ఇతర పన్నుల వాటా 0.01 కోట్ల సర్వీస్ పన్నుల వాటా కింద 4,671.47 కోట్ల రూపాయలు కేటాయించారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అంశాన్ని నాబార్డ్ రుణంతో ముడిపెట్టడం వలన బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులూ చేయలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read