విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలోనే స్థాపించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేసిన తరువాత కేంద్రం స్పందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావడం జరిగింది.

విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకోసం అప్పటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం నేతృత్వంలో సాగిన ఉద్యమం 1966లో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రా విశ్వ విద్యాలయం విద్యార్ధులు భారీగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు, ఏవీఏన్ కాలేజీ డౌన్ వద్ద, జగదాంబ ధియేటర్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది విద్యార్ధులు, రిక్షా కార్మికులు మరణించారు. ఈ కాల్పులకు నిరసనగా హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తి వందలాది మంది అరెస్టులకు దారితీసాయి. వరంగల్, ఆముదాలవలస, విజయనగరంలో కూడా కాల్పులు చోటుచేసుకుని పదులకొద్దీ ఉద్యమకారులు తుపాకీ గుళ్ళకు బలయ్యారు. ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు 1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ లో ప్రకటించింది.

ఈ ప్లాంట్ ఏర్పాటుకు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.1982 ఫిబ్రవరి 18న విశాఖ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు విశాఖ ఉక్కు ప్యాక్టరీ మూడున్నర దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం 35వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 18,000ల పైచలకు శాశ్వత కార్మిక ఉద్యోగస్తులకు ,20,000ల పైచలకు ఒప్పంద కార్మికులకు ఉపధి కల్పిస్తూ 35 వసంతాలు పూర్తిచెసుకుంది.

ఎన్నో అంచనాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభంలోనే అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంది. కర్మాగారం నిర్మాణం ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి అప్పలు కూడా పెరిగిపోయాయి. వడ్డీ భారంతో 1998వ సంత్సరానికి స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో సీల్లుప్లాంటు యూజమాన్యం, అధికారులు, కార్మికులు సమిష్టిగా పనిచేసి, ఉత్పత్తిని పెంచి, ప్రభుత్వ సహకారం కూడా కొంత తోడవ్వడంతో తక్కువ కాలంలోనే లాభాల బాట పట్టించారు.

1972లో శంకుస్థాపన చేయబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18 వరకూ స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలో ఉండేది. భారత ప్రభుత్వం 1982 ఫిబ్రవరి 18న "రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)గా ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా కొనసాగుతోంది.

విశాఖ ఉక్కు కర్మాగారం 2001 నుంచి ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ అప్పులను తీర్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తూ దేశీయ పారిశ్రామిక యవనికపై గర్వంగా నిలబడింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం అన్నిరకాల విస్తరణ పనులు పూర్తి చేసుకుని 6.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా పరుగెడుతోంది. సీల్ మెల్ట్ షాపు సెంటర్ ప్లాంట్, బ్లాన్స్ ఫర్నెస్ తదితర విభాగాలు ప్రారంభమై రెండో దశ ఉత్పత్తి ఊపందుకుంది.

2025 నాటికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read